జ్యోతిరావు ఫూలే జయంతి : ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భూమిపూజకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: జ్యోతిరావు ఫూలే జయంతిని ఆల్వాల్ ల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి ఆయన చేసిన అమూల్య సేవలను స్మరించుకున్నారు.
అనంతరం, హనుమంతరావు ఆల్వాల్ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1 కోటి వ్యయంతో, దాదాపు 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టిల్ట్తో పాటు రెండు అంతస్తులతో ఈ భవనం నిర్మించబడనుంది.
ఈ కార్యక్రమంలో ఆల్వాల్ ప్రెస్ క్లబ్ సభ్యులు రాములు (అధ్యక్షుడు), మల్లేష్, మధుసూదన్ రెడ్డి, ప్రసాద్, చంద్రశేఖర్, శివకుమార్, దేవేందర్, శ్రీరాములు, రాజేష్, ఉపేందర్, శేఖర్, సురేష్, హరి ప్రకాష్, రాజినీ కాంత్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz