ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు.ఎమ్మిగనూరు పట్టణం లోని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద మహానీయుడు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు_మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘసంస్కర్తగా సామాజికవేత్తగా జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఉన్న అసమానతలను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. మహిళా విద్య, సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అపారమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పూలే గారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz