ఘనంగా జ్యోతిరావు పూలే కు నివాళి
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జ్ గుదే రాజారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయ సామాజిక సంస్కర్త 199వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించబడిందని,పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించామని తెలియజేశారు.అనంతరం బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి నల్లమోతు సామెల్ జాన్సన్ మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం,విద్యా విస్తరణ, దళిత-బహుజన హక్కుల కోసం చేసిన పోరాటం ఈ రోజుకీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా విద్యకు పునాది వేసి, అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శీలం రోజెన్ బాబు, నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు పాలపర్తి సంతమ్మ,సంజీవరావు, తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు*.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz