75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,

0
301

జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కానుంది.

విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణమంటూ అచ్చెన్నాయుడు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ఈ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను గుర్తించి, ప్రత్యేక చొరవ చూపించి రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ రైలు సర్వీసు మంజూరులో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు.. అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టంగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. మరోవైపు తిరుపతి - శ్రీకాకుళం రోడ్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17439) ప్రతి ఆదివారం తిరుపతి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరుతుంది. సోమవారల మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం - తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (17440) ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రైల్వే్ స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది

.

 

References

Search
Categories
Read More
Andhra Pradesh
లెఫ్ట్ పార్టీస్ ప్రెస్ స్టేట్మెంట్
వామపక్ష పార్టీలు ప్రచురణార్ధం/ప్రసారార్ధం :          విజయవాడ, తేది :...
By Rajini Kumari 2025-12-18 11:40:16 0 214
Andhra Pradesh
ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: ఎస్పీ ధీరజ్ సూచనలు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-04-30 04:10:13 0 91
Andhra Pradesh
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
By Kothuru Murali 2026-03-29 07:24:25 0 256
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం, శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న చింత చెట్టు నుంచి పాలు కారుతుండటాన్ని స్థానిక మహిళలు దైవ మహిమగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం, శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న చింత...
By Kothuru Murali 2026-01-27 13:36:38 0 192
Telangana
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి
     కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా...
By Sidhu Maroju 2025-06-04 17:02:21 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com