₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి

0
1K

 

 

 కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైపు లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక యంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ గార్లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారితో, ఉన్నతాధికారులతో మాట్లాడి 5.9 యం జి డి ఉన్న నీటి సరఫరాను 1 యం జి డి పెంచి 6.9 యం జి డి చేపించానని,ఆ నీటి నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కూడా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరిపడా లేకపోవడంతో ఇటీవల వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారిని స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఆహ్వానించి బోర్డు CEO గారు మరియు ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ
పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ...
By Kothuru Murali 2026-02-14 07:51:48 0 93
Telangana
రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కలిసి కాచిగూడ -భగవతి రైల్ వే స్టేషన్ కు మొదటి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ జిల్లా/కాచిగూడ.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-07-19 17:13:19 0 949
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె...
By Pagadala Venkateswar 2026-03-20 03:44:45 0 93
Andhra Pradesh
పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన
సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల...
By Kothuru Murali 2026-01-29 08:57:35 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com