₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి

0
1K

 

 

 కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైపు లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక యంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ గార్లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారితో, ఉన్నతాధికారులతో మాట్లాడి 5.9 యం జి డి ఉన్న నీటి సరఫరాను 1 యం జి డి పెంచి 6.9 యం జి డి చేపించానని,ఆ నీటి నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కూడా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరిపడా లేకపోవడంతో ఇటీవల వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారిని స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఆహ్వానించి బోర్డు CEO గారు మరియు ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 270
Telangana
అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, మర్రి రాజశేఖర్ రెడ్డి భారత...
By Sidhu Maroju 2025-12-06 12:20:57 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com