ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ క్యాలెండర్ను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహేంద్ర నాథ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కోసం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, భవిష్యత్తులోనూ వారి అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మైనారిటీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడమే లక్ష్యంగా టిడిపి పనిచేస్తోందని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం టిడిపి టౌన్ ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ బాషా మాట్లాడుతూ, ఉర్దూ అకాడమీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు మైనారిటీల సాంస్కృతిక మరియు విద్యా వికాసానికి ఎంతగానో దోహదపడుతున్నాయని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, ముస్లిం మైనారిటీ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముస్లిం మైనారిటీ వర్గాల నుండి విశేష స్పందన లభించింది.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz