అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|

0
163

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహాన్ని యథావిధిగా తిరిగి ప్రతిష్టించకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గట్టిగా హెచ్చరించారు.

శుక్రవారం వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ముందు నుంచి తొలగించిన అంబేద్కర్ విగ్రహం, కూల్చివేసిన గద్దె పరిసరాలను బక్కి వెంకటయ్య స్వయంగా పరిశీలించారు. 

అనంతరం బస్తీ వాసులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విగ్రహాన్ని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారని స్థానికులు వివరించగా, వెంటనే స్పందించిన కమిషన్ చైర్మన్ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్ ఫణికుమార్‌కు ఫోన్ చేసి సోమవారం లోపు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని ఆదేశించారు.

అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్‌ను సంప్రదించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

“ఏప్రిల్ నెల మహనీయుల పండుగల నెల. అలాంటి సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం, గద్దె కూల్చివేయడం తీవ్ర అవమానం” అని బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురు దళిత నాయకులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం లో మార్నింగ్ వాక్ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
శ్రీరాంపూర్‌ : మంచిర్యాల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  ఈరోజు ఉదయం...
By Avunoori Mahesh 2026-04-21 03:47:11 0 128
Karnataka
Bengaluru’s Tech Prowess: "The World is Watching"
In a major boost to the state’s economic morale, Deputy CM D.K. Shivakumar hailed Bengaluru...
By Dunna Jessicaruth 2026-05-14 09:41:42 0 65
Andhra Pradesh
జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.
అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-02-21 04:30:49 0 124
Andhra Pradesh
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం సీఎం చంద్రబాబు కి వినతి పత్రం
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు...
By Rajini Kumari 2025-12-23 07:19:35 0 158
Andhra Pradesh
శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు
శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల...
By Manda Ramkumar 2026-03-28 09:27:22 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com