అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|

0
195

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహాన్ని యథావిధిగా తిరిగి ప్రతిష్టించకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గట్టిగా హెచ్చరించారు.

శుక్రవారం వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ముందు నుంచి తొలగించిన అంబేద్కర్ విగ్రహం, కూల్చివేసిన గద్దె పరిసరాలను బక్కి వెంకటయ్య స్వయంగా పరిశీలించారు. 

అనంతరం బస్తీ వాసులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విగ్రహాన్ని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారని స్థానికులు వివరించగా, వెంటనే స్పందించిన కమిషన్ చైర్మన్ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్ ఫణికుమార్‌కు ఫోన్ చేసి సోమవారం లోపు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని ఆదేశించారు.

అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్‌ను సంప్రదించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

“ఏప్రిల్ నెల మహనీయుల పండుగల నెల. అలాంటి సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం, గద్దె కూల్చివేయడం తీవ్ర అవమానం” అని బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురు దళిత నాయకులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి కి రక్తంతో లేఖ..!
హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తన రక్తంతో తెలంగాణ ముస్లిం...
By Sunka Santhosh 2026-05-02 17:38:32 0 168
Andhra Pradesh
వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి విశిష్టత
మనకి మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. (ఒక సంవత్సరంలో 24 + అధిక మాసంలో 2. వీటి అన్నిటిలో వైకుంఠ‌...
By John Baji 2025-12-30 01:55:32 0 197
Andhra Pradesh
జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్
*బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న*  *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి...
By Rajini Kumari 2026-01-03 09:20:02 0 353
Andhra Pradesh
Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.
శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ...
By Pagadala Venkateswar 2026-02-10 09:37:11 0 157
Andhra Pradesh
మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-01-23 06:19:45 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com