తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
183

సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు పడింది. నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యత అపారమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు.

తిరుమలగిరి లాల్ బజార్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక గ్రంథాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గ్రంథాలయం ద్వారా విద్యార్థులు, యువతకు అవసరమైన సమాచారం, విషయ పరిజ్ఞానం సులభంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్‌పల్లి, బొల్లారంలలో కూడా త్వరలోనే గ్రంథాలయాల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

గ్రంథాలయంలో అన్ని ఆధునిక వసతులు కల్పించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, తన సొంత నిధులతో అధ్యాపకులను మార్గదర్శకులుగా నియమించి యువతకు మెరుగైన భవిష్యత్తు అందించే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
బాలీవుడ్ లో రికార్డు బ్రేక్...
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు...
By Yadamma Raju Gajapaga 2025-12-23 08:02:53 0 685
Andhra Pradesh
మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన
మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి...
By Chennaiah Kati 2026-07-10 05:56:23 0 58
Telangana
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా  పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ. దాదాపు 50 లక్షల విలువైన...
By Sidhu Maroju 2025-11-16 07:26:06 0 213
Telangana
"ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం...
By Sidhu Maroju 2026-06-13 13:28:25 0 147
Telangana
Voter survey
తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి ఓటరు సర్వే ప్రారంభం   తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ...
By G k Nookala 2026-06-25 07:10:53 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com