తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు పడింది. నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యత అపారమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు.
తిరుమలగిరి లాల్ బజార్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక గ్రంథాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గ్రంథాలయం ద్వారా విద్యార్థులు, యువతకు అవసరమైన సమాచారం, విషయ పరిజ్ఞానం సులభంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి, బొల్లారంలలో కూడా త్వరలోనే గ్రంథాలయాల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
గ్రంథాలయంలో అన్ని ఆధునిక వసతులు కల్పించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, తన సొంత నిధులతో అధ్యాపకులను మార్గదర్శకులుగా నియమించి యువతకు మెరుగైన భవిష్యత్తు అందించే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు.
#sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz