ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు.

0
144

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు మండిపోతుండగా, మరోవైపు కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

 

తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో గురువారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని ప్రత్యేకంగా హెచ్చరించారు.

 

మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా చిత్తూరు, నంద్యాల, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదు: జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించి న్యాయం...
By Pagadala Venkateswar 2026-03-16 10:06:23 0 157
Andhra Pradesh
తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.
  బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:05:42 0 206
Telangana
ADB: రిమ్స్ లో బాలింత మృతి.. ఏడుగురిపై చర్యలు
రిమ్స్లో ఉట్నూర్ మండలం పిట్లగూడకు ఆదివాసీ మహిళ గంగశీల మృతి ఘటనలో ఏడుగురు సిబ్బందిపై జిల్లా...
By Mitappaly Shiavji 2026-01-01 04:00:48 0 606
Goa
Eco-Conservation
The Goa government has officially notified 4 lakh square metres of ecologically sensitive land...
By Dunna Jessicaruth 2026-05-16 05:50:44 0 119
Andhra Pradesh
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు.
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనాని Both States Tirumala Queue Lines...
By Pagadala Venkateswar 2026-05-25 04:51:10 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com