బీబీఏ మీడియా కమిటీ చైర్మన్ గా జయప్రకాష్ నియామకం

0
172

*బి.బి.ఎ. మీడియా క‌మిటీ ఛైర్మ‌న్‌గా జ‌య‌ప్ర‌కాష్ నియామ‌కం*

 

*విజ‌య‌వాడ‌:- అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ (బి.బి.ఎ.) మీడియా క‌మిటీ ఛైర్మ‌న్‌గా విష్ణుబొట్ల జ‌య‌ప్ర‌కాష్(జేపీ) నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు బి.బి.ఎ. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు విష్ణుబొట్ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, వ‌లిబోయిన కిర‌ణ్‌కుమార్‌లు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. బెజ‌వాడ‌కు చెందిన విష్ణుబొట్ల జ‌య‌ప్ర‌కాష్ గ‌తంలో మీడియా రంగంలో విశేష అనుభ‌వంతో పాటు జ‌ర్న‌లిజం మాస్ క‌మ్యూనికేష‌న్‌, సోష‌యాల‌జీ, సైకాల‌జీ వంటి అంశాల‌లో పోస్ట్ గ్రాడ్యూయేష‌న్ చేసి ఉండ‌డంతో జ‌య‌ప్ర‌కాష్‌ను ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. అదేవిధంగా క‌న్వీన‌ర్లుగా సీనియ‌ర్ న్యాయ‌వాదులు పి.వి.ఏడుకొండ‌లు, వి.రాయ‌ప్ప‌, స‌భ్యులుగా పి.న‌గేష్‌కుమార్‌, వంగా ర‌మేష్ కుమార్‌, ఎ.సురేష్‌కుమార్‌, ఉప్పాల శ్రీనివాస‌రావు, పి.ఎస్‌.ఆర్‌. ప్ర‌సాద్ బాబు, పి.స‌త్య‌నారాయ‌ణ‌, సోగాని ర‌మేష్‌కుమార్‌, పి.ఎస్‌.ఆర్‌. ప్ర‌స‌న్నజి, గ‌గ‌న సింధూ, పోతూరు చ‌ర‌ణ్ సుధామ్స్‌ల‌ను నియ‌మించారు.*

 

*క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ నియామ‌కం..*

 

*క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీలో సీనియ‌ర్ న్యాయ‌వాదులు డి.ఎస్‌.మ‌హేంద్ర‌, టి.వి.న‌వ‌కుమార్‌, పెద్దిబోయిన (బండి) జ్యోతిల‌ను నియ‌మిస్తూ బి.బి.ఎ. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు విష్ణుబొట్ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, వ‌లిబోయిన కిర‌ణ్‌కుమార్‌లు ఉత్వ‌ర్వులు జారీ చేశారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని
నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది...
By Boya Dasthagiri 2026-04-18 06:36:30 0 148
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన గుంటూరు కలెక్టర్ మరియు ఎస్పీ
 *ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్.పి* గుంటూరు, డిసెంబరు 24 :...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:21:15 0 250
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-18 06:15:05 0 208
Andhra Pradesh
పుంగనూరు: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
పుంగునూరు మండలం, పాలెంపల్లి గ్రామానికి చెందిన గౌరీ శంకర్ (21) అనే యువకుడు గత మూడు నెలలుగా...
By Kothuru Murali 2026-03-24 13:24:02 0 159
Andhra Pradesh
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
By Kothuru Murali 2026-03-27 14:48:50 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com