బీబీఏ మీడియా కమిటీ చైర్మన్ గా జయప్రకాష్ నియామకం

0
173

*బి.బి.ఎ. మీడియా క‌మిటీ ఛైర్మ‌న్‌గా జ‌య‌ప్ర‌కాష్ నియామ‌కం*

 

*విజ‌య‌వాడ‌:- అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ (బి.బి.ఎ.) మీడియా క‌మిటీ ఛైర్మ‌న్‌గా విష్ణుబొట్ల జ‌య‌ప్ర‌కాష్(జేపీ) నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు బి.బి.ఎ. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు విష్ణుబొట్ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, వ‌లిబోయిన కిర‌ణ్‌కుమార్‌లు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. బెజ‌వాడ‌కు చెందిన విష్ణుబొట్ల జ‌య‌ప్ర‌కాష్ గ‌తంలో మీడియా రంగంలో విశేష అనుభ‌వంతో పాటు జ‌ర్న‌లిజం మాస్ క‌మ్యూనికేష‌న్‌, సోష‌యాల‌జీ, సైకాల‌జీ వంటి అంశాల‌లో పోస్ట్ గ్రాడ్యూయేష‌న్ చేసి ఉండ‌డంతో జ‌య‌ప్ర‌కాష్‌ను ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. అదేవిధంగా క‌న్వీన‌ర్లుగా సీనియ‌ర్ న్యాయ‌వాదులు పి.వి.ఏడుకొండ‌లు, వి.రాయ‌ప్ప‌, స‌భ్యులుగా పి.న‌గేష్‌కుమార్‌, వంగా ర‌మేష్ కుమార్‌, ఎ.సురేష్‌కుమార్‌, ఉప్పాల శ్రీనివాస‌రావు, పి.ఎస్‌.ఆర్‌. ప్ర‌సాద్ బాబు, పి.స‌త్య‌నారాయ‌ణ‌, సోగాని ర‌మేష్‌కుమార్‌, పి.ఎస్‌.ఆర్‌. ప్ర‌స‌న్నజి, గ‌గ‌న సింధూ, పోతూరు చ‌ర‌ణ్ సుధామ్స్‌ల‌ను నియ‌మించారు.*

 

*క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ నియామ‌కం..*

 

*క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీలో సీనియ‌ర్ న్యాయ‌వాదులు డి.ఎస్‌.మ‌హేంద్ర‌, టి.వి.న‌వ‌కుమార్‌, పెద్దిబోయిన (బండి) జ్యోతిల‌ను నియ‌మిస్తూ బి.బి.ఎ. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు విష్ణుబొట్ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, వ‌లిబోయిన కిర‌ణ్‌కుమార్‌లు ఉత్వ‌ర్వులు జారీ చేశారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 299
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్...
By Pagadala Venkateswar 2026-01-05 07:53:21 0 248
Chandigarh
Monsoon Relief: Chandigarh Under Yellow Alert for Rain
Chandigarh, alongside Punjab and Haryana, is experiencing a much-needed respite from the...
By Lokeshwari Panthadi 2026-07-03 05:51:36 0 41
Andhra Pradesh
జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు మంచినీటి సౌకర్యం కొరకు 100 కోట్లు మంజూరు
*ప్ర‌చుర‌ణార్థం* *08-01-2026*   జ‌గ్గ‌య్య‌పేట‌లో డిఫెన్స్...
By Rajini Kumari 2026-01-08 11:41:13 0 181
Andhra Pradesh
దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని
*ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*   *దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-28 12:56:30 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com