ప్రతి ఇంటిపైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి -47 వ బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శరకణం రాజబాబు.
కిర్లంపూడి, , ఏప్రియల్ 06: ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంటిపైనా బిజెపి జెండా ఎగరడమే కాకుండా,గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కిర్లంపూడి మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శరకణం రాజబాబు పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో సీనియర్ బిజెపి నాయకుడు,మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలతో,జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణ వర్మ పర్యవేక్షణలో బిజెపి సీనియర్ నాయకులు,మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షులు అల్లు శివరామకృష్ణ
ఆధ్వర్యంలో,నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శరకణం రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలకు మోడీ అందించిన పథకాలను వివరించారు. ప్రత్యక్ష, పరోక్ష రాజకీయాలను కూడా ప్రజలు మాట్లాడుకునే దిశ గా ఉన్నాయంటే మోడీ చలవే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనేటి శ్రీనివాసరావు,మండల ఓబిసి అధ్యక్షులు పెంటకోట సత్యనారాయణ,మండల కార్యదర్శిలు భీమనాధులు వీరబాబు,ఆడారి రామచంద్రరావు,మండల ఉపాధ్యక్షులు బుద్ధ సత్యనారాయణ,బిజెపి నాయకులు గోలి సుబ్బారావు, అరటా పెద్ద పోలీస్, బాలిమ్ రామకృష్ణ, అప్పారావు,వానపల్లి గంగాధర్,పలికిల సత్యనారాయణ, బొడ్డేటి చిన్నబ్బాయి,పప్పుల రాంబాబు, బొడ్డేటి బాబురావు,రాపేటి కోటేశ్వరరావు,నైదాన రవి, పిట్ట లోవ,కడియాల చిన్న, పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz