America blast their own aircraft

0
158

America: రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా!

06-04-2026 Mon 12:22 | International

America Destroys Own Aircraft Worth Rs 931 Crore in Iran

 

షార్ట్స్‌లో చూడండి

ఇరాన్ భూభాగంలో తమకు చెందిన అత్యాధునిక విమానాన్ని అమెరికా స్వయంగా బాంబులతో పేల్చివేసింది. సుమారు 931 కోట్ల రూపాయల ($100 మిలియన్లు) విలువైన ఈ విమానాన్ని శత్రుదేశానికి చిక్కకూడదనే ఏకైక కారణంతో ధ్వంసం చేసింది. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

 

వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ ఫైటర్ పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం రహస్యంగా ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో పైలట్‌ను తరలించేందుకు వెళ్లిన విమానాల్లో ఒకటి సాంకేతిక లోపంతో ఎడారి ప్రాంతంలో నిలిచిపోయింది. ఆ విమానంలో అత్యంత కీలకమైన సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రహస్య యుద్ధ సాంకేతికత ఉన్నాయి.

 

ఈ టెక్నాలజీ ఇరాన్ చేతికి చిక్కితే తమ సైనిక రహస్యాలు బయటపడతాయని అమెరికా భావించింది. ఆర్థికంగా భారీ నష్టమైనా భరించి, దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అక్కడున్న కమాండోలు ఆ విమానాన్ని పేల్చివేసి, పైలట్‌ను మరో విమానంలో సురక్షితంగా తరలించారు. ఈ ఘటన 1980లో జరిగిన ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ వైఫల్యాన్ని గుర్తుచేస్తోంది. అప్పట్లో కూడా అమెరికా తమ విమానాలను ఇరాన్ ఎడారిలో వదిలిరావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈసారి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా అమెరికా జాగ్రత్త పడింది.

 

ప్రస్తుతం ఇరాన్ ఈ విమాన శకలాల ఫొటోలను విడుదల చేస్తూ, అమెరికా ఆపరేషన్ విఫలమైందని ప్రచారం చేస్తోంది. అయితే, వందల కోట్ల ఆస్తి కన్నా సైనిక రహస్యాలకే ఎక్కువ విలువిస్తామని ఈ చర్య ద్వారా అమెరికా స్పష్టం చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు లోఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలియజేయడమేనగా రేపు 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు...
By Boya Dasthagiri 2026-04-13 12:27:07 0 130
Andhra Pradesh
Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను...
By Pagadala Venkateswar 2026-02-08 11:20:53 0 129
Telangana
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌
  -- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం -- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన...
By Thalakayala Nagashiva 2026-04-12 10:04:29 0 163
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:09 0 406
Telangana
కరీంనగర్ బస్టాండ్ లో ప్రయాణికుల నిరీక్షణ
రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు...
By Sunka Santhosh 2026-04-24 14:43:24 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com