Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి.

0
162

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు పెన్నా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.

 

కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు 'ఫ్రంట్‌లైన్ ప్రెస్' పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. ఆదివారం చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వెళ్లారు. వారిలో హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణచైతన్య (20) చిత్రీకరణలో భాగంగా నదిలోకి దిగారు. అయితే, అక్కడ నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి చిక్కుకుని ముగ్గురూ కొట్టుకుపోయారు.

 

గట్టున ఉన్న స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే హర్షవర్ధన్, హరిబాబు మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. చీకటి పడటంతో గల్లంతైన కృష్ణచైతన్య కోసం గాలింపును నిలిపివేశారు.

 

మృతుడు హర్షవర్ధన్, గల్లంతైన కృష్ణచైతన్య కడప కేఎస్ఆర్‌ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. హరిబాబు ఓ హోమియోపతి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో సుడిగుండాలు ఉంటాయని, ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా యువకులు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 05:44:04 0 1K
Tamilnadu
Stalin Introspects After DMK’s Election Defeat
Following the victory of the Tamilaga Vettri Kazhagam (TVK), DMK President and former CM M.K....
By Dunna Jessicaruth 2026-05-14 11:20:40 0 67
Andhra Pradesh
పుంగునూరులో ప్రారంభమైన రోడ్డు పనులు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పుంగనూరు-బెంగళూరు రహదారి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి....
By Kothuru Murali 2026-05-18 15:23:56 0 30
Andhra Pradesh
మదనపల్లి: పోలీసుల ఆరోగ్యంపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.
మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-05-22 05:09:26 0 43
Andhra Pradesh
పేదల సేవలో కూటమి ప్రభుత్వం
*పేదల సేవలో కూటమి ప్రభుత్వం* *పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందచేత*...
By Rajini Kumari 2025-12-31 10:30:50 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com