Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి.

0
221

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు పెన్నా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.

 

కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు 'ఫ్రంట్‌లైన్ ప్రెస్' పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. ఆదివారం చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వెళ్లారు. వారిలో హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణచైతన్య (20) చిత్రీకరణలో భాగంగా నదిలోకి దిగారు. అయితే, అక్కడ నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి చిక్కుకుని ముగ్గురూ కొట్టుకుపోయారు.

 

గట్టున ఉన్న స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే హర్షవర్ధన్, హరిబాబు మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. చీకటి పడటంతో గల్లంతైన కృష్ణచైతన్య కోసం గాలింపును నిలిపివేశారు.

 

మృతుడు హర్షవర్ధన్, గల్లంతైన కృష్ణచైతన్య కడప కేఎస్ఆర్‌ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. హరిబాబు ఓ హోమియోపతి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో సుడిగుండాలు ఉంటాయని, ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా యువకులు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి డిసి కి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ జిహెచ్ఎంసి నూతన DC...
By Sidhu Maroju 2025-12-29 12:22:30 0 177
Andhra Pradesh
చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...
By SivaNagendra Annapareddy 2025-12-15 10:31:27 0 279
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 46
Andhra Pradesh
జూదం, కోడి పందేలపై దాడులు… 29 మంది అరెస్ట్: డీఎస్పీ.
ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి...
By Pagadala Venkateswar 2026-04-20 03:26:41 0 108
Telangana
కారేపల్లి పోలీస్ స్టేషన్ లో పెద్ది నిర్బంధం... ఖమ్మం జిల్లా
ఆర్టీసీ డ్రైవర్ మృతితో నిరసన వ్యక్తిత్వం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్...
By Gujile Ramu 2026-04-25 05:23:54 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com