ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ

0
212

బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు హెల్మెట్ ధరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనందున వల్లే ప్రమాదం సాత్తు వాహనాలు ఢీకొట్టడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు పోతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందికరంగా భావిస్తున్నారని హెల్మెట్ నే ప్రాణానికి రక్షణ కవచమని ప్రజలు తెలుసుకోలేక పోతున్నారని వారు తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే ముందు వారికి ఒక కుటుంబం ఉందని ఆలోచించాలని నష్టం జరిగిపోతే కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాలని మద్యం సేవించి వాహనాలు నడుపు రాదని వారు కోరారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ మైన డ్రైవర్ని ప్రోత్సహించేది లేదని తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటావని హెచ్చరించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: కల్యాణలక్ష్మి - షాధీముబారక్ చెక్కల పంపిని
ఈ రోజు నందిపేట్ మండల రెవెన్యు కార్యాలయంలో కళ్యాణలక్ష్మిషాదీముబారక్ పాతకాల లబ్ధికారులకు చెకుల...
By Sadaq Sadaq 2026-04-20 16:28:01 0 89
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకుందాం
రైతులు పంటలు పండించడానికి రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకోవాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు...
By Kothuru Murali 2026-03-16 07:04:17 0 123
Telangana
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
By Sidhu Maroju 2025-06-16 18:38:55 0 1K
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు  : కర్నూలు జిల్లా  కర్నూలు జిల్లా.   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
By Hari Krishna 2026-02-03 12:31:43 0 395
Andhra Pradesh
జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు...
By Hari Krishna 2026-01-02 15:29:55 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com