ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ

0
253

బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు హెల్మెట్ ధరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనందున వల్లే ప్రమాదం సాత్తు వాహనాలు ఢీకొట్టడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు పోతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందికరంగా భావిస్తున్నారని హెల్మెట్ నే ప్రాణానికి రక్షణ కవచమని ప్రజలు తెలుసుకోలేక పోతున్నారని వారు తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే ముందు వారికి ఒక కుటుంబం ఉందని ఆలోచించాలని నష్టం జరిగిపోతే కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాలని మద్యం సేవించి వాహనాలు నడుపు రాదని వారు కోరారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ మైన డ్రైవర్ని ప్రోత్సహించేది లేదని తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటావని హెచ్చరించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో పోలీసుల 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ.
కేంద్ర క్రీడా శాఖ 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-06-07 13:12:31 0 83
Telangana
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...
By Sidhu Maroju 2025-09-03 10:42:41 0 387
Business & Finance
June GST Growth Supports Nagaland's Development
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
By Navya Sree 2026-07-02 13:33:00 0 62
Goa
Monsoon Fury Knocks Early
Goa experienced its strongest pre-monsoon activity of the season yesterday, triggering a...
By Dunna Jessicaruth 2026-05-25 05:30:57 0 146
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
By Pagadala Venkateswar 2026-04-21 03:14:46 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com