₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|

0
243

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం నలుగురు నిందితులు గంజాయిని నాలుగు బ్యాగుల్లో పెట్టుకొని కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు.

శనివారం పగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయం వద్ద గంజాయి కొనుగోలుదారుడి కోసం ఎదురు చూస్తుండగా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20 గంజాయి పాకెట్లు లభించాయి. వాటిని తూకం వేయగా 42.9 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ వద్ద నుంచి రూ.72,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు.. గణేష్ శివనాథ్ బోడుగే (42)పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33)విన్నీ శైలేష్ మేశారాం (32)ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54)

వీరు మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు గుర్తించారు.

విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం… తుని, నర్సీపట్నం ప్రాంతాల్లో కిలోకు రూ.4,000కు గంజాయిని కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో రూ.12,000 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ ఆపరేషన్‌లో సీఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ, ఎస్సైలు శ్రీనివాసులు, రూప, భూపాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
*పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు*   *మంగళగిరి...
By Rajini Kumari 2026-01-23 12:04:42 0 176
Andhra Pradesh
నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్డులో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద కల్వర్టు...
By John Baji 2026-01-23 01:53:03 0 177
Andhra Pradesh
మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.
మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు...
By Pagadala Venkateswar 2026-03-11 03:11:49 0 121
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:33:53 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com