₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|

0
327

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం నలుగురు నిందితులు గంజాయిని నాలుగు బ్యాగుల్లో పెట్టుకొని కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు.

శనివారం పగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయం వద్ద గంజాయి కొనుగోలుదారుడి కోసం ఎదురు చూస్తుండగా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20 గంజాయి పాకెట్లు లభించాయి. వాటిని తూకం వేయగా 42.9 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ వద్ద నుంచి రూ.72,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు.. గణేష్ శివనాథ్ బోడుగే (42)పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33)విన్నీ శైలేష్ మేశారాం (32)ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54)

వీరు మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు గుర్తించారు.

విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం… తుని, నర్సీపట్నం ప్రాంతాల్లో కిలోకు రూ.4,000కు గంజాయిని కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో రూ.12,000 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ ఆపరేషన్‌లో సీఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ, ఎస్సైలు శ్రీనివాసులు, రూప, భూపాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Telangana
స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి
సికింద్రాబాద్ :   గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి...
By Sidhu Maroju 2025-10-06 18:45:42 0 267
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 417
Telangana
ఢిల్లీ జైళ్ళ సిబ్బంది ప్రాథమిక ఇండక్షన్ శిక్షణని ప్రారంభించిన : డీజీపీ శివధర్ రెడ్డి
ఢిల్లీ జైళ్ల సిబ్బంది కోసం ఉద్దేశించిన ప్రాథమిక ఇండక్షన్ శిక్షణా కార్యక్రమాన్ని...
By Avunoori Mahesh 2026-04-29 14:15:35 0 163
Telangana
అల్వాల్ పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సమాజ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సేవలను గుర్తించడం...
By Sidhu Maroju 2026-03-21 16:29:49 0 212
Andhra Pradesh
అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట
 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది....
By SivaNagendra Annapareddy 2025-12-12 10:06:18 0 394
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com