రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం రైతన్నలకు భరోసా

0
194

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

కొటికలపూడిలో పట్టాదారు పాసుబుక్స్ పంపిణీ.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 04/04/2026.

 

ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వెల్లడించారు.

 

ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు శనివారం పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందన్నారు. తప్పులను సరిదిద్ది భూవివాదాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ కర్తవ్యం అని వివరించారు. 

 

పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం ఒకప్పుడు రైతులే అధికారులు చుట్టూ తిరిగేవారు. పాస్‌ పుస్తకం వస్తే రైతులకు అదో వరం. ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వం వద్ద సంప్రదింపులు జరిపి పాస్‌ పుస్తకాలు మంజూరు చేసేలా గట్టి ప్రయత్నాలు చేసేవారు. అటువంటిది ఇప్పుడు అధికారులే పట్టాదారు పుస్తకాలు ఇస్తామంటూ రైతులు చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడున్నాసరే సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కెవైసీ చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Rajasthan
IMD Southwest Monsoon Withdraws Early in West Rajasthan |
The India Meteorological Department (IMD) has announced the early withdrawal of the southwest...
By Pooja Patil 2025-09-15 12:11:46 0 199
Andhra Pradesh
కడపలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర
ఈరోజు కడప నగరంలో అయోధ్య రామ మందిరం మూడవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా కడపలో హిందూ బంధువులు...
By Benguluri Madhubabu 2026-01-22 04:32:02 0 252
Nagaland
CBI Launches Corruption Probe into Nagaland University Tender Scandal
On July 12, the CBI registered a graft case against Nagaland University professor Chitta Ranjan...
By Bharat Aawaz 2025-07-17 11:03:25 0 1K
Andhra Pradesh
వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.
మదనపల్లె మండలం, కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్టలోని వెలుగు వృద్ధాశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్...
By Pagadala Venkateswar 2026-02-11 05:54:56 0 110
Andhra Pradesh
Inauguration of Sri potti Sri ramulu statue
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్'...
By G k Nookala 2026-03-15 10:18:02 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com