కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|

0
206

హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం... కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వన్‌వే ట్రయల్ అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ ట్రయల్‌లో భాగంగా కొన్ని ప్రధాన రహదారులపై వాహన రాకపోకలకు మార్పులు ఉంటాయని చెప్పారు. ట్రయల్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇదే మార్గాలను శాశ్వతంగా అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.

పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్ 2 ద్వారా ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, 10 మీదుగా రోడ్ నెంబర్ 45కి మళ్లించనున్నారు. అలాగే మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ముందుగా రోడ్ నెంబర్ 2 వైపు మళ్లించనున్నారు.

రోడ్ నెంబర్ 10, 12 ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మార్గంలో జూబ్లీ చెక్‌పోస్ట్ ద్వారా కేబీఆర్ పార్క్ చేరుకునేలా డైవర్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్ మార్పులను గమనించి, పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని నగర ప్రజలను కోరారు.

#sidhumaroju 

Alwal

 

Search
Categories
Read More
Jharkhand
Crackdown on Corruption: ED Files Case in Treasury Scam
The Enforcement Directorate (ED) has officially registered a money laundering case (ECIR)...
By Dunna Jessicaruth 2026-05-15 10:02:34 0 47
Andhra Pradesh
ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీ
ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్...
By Karapati Gopi 2025-12-31 01:03:41 0 474
Andhra Pradesh
ప్రత్యేక మొబైల్ యాప్ సాయంతో సమగ్ర కుటుంబ సర్వే - ఏపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఆఖరి నుంచి సమగ్ర కుటుంబ...
By John Baji 2025-12-25 05:59:51 0 327
Andhra Pradesh
వృద్ధురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన
చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం...
By Kothuru Murali 2026-04-11 05:39:52 0 73
Andhra Pradesh
కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి...
By Pagadala Venkateswar 2026-03-04 11:39:37 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com