బి వి జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది.

0
145

ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన చారిత్రాత్మక ఘట్టంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతుల మహా త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ విజయాన్ని ఊరూరా పండుగలా జరుపుకున్నారు.

అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలోని 26 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతి గడపకు చేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షగా నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మాచాని సోమప్ప కూడలిలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు : దుంపల రంజిత్ కుమార్
* మంచిర్యాల జిల్లా * ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి * ఆర్టీసీని...
By Avunoori Mahesh 2026-04-23 08:05:09 0 99
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి...
By Kothuru Murali 2026-02-23 12:10:00 0 102
Andhra Pradesh
మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిలిం లాంచ్
*పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా 'మా ఇంటి పెద్ద కొడుకు' షార్ట్ ఫిలిం లాంచ్*    ...
By Rajini Kumari 2026-03-14 11:24:32 0 151
Andhra Pradesh
శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు
  మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట...
By Boya Dasthagiri 2026-03-25 13:07:53 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com