ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*
*ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*
" వెండిరధం పై ఊరేగిన ఆదిదంపతులు"
ఇంద్రకీలాద్రి పై వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవల్లో భాగంగా...సాయంత్రం 5 గంటలకు -శ్రీ మల్లేశ్వర మహా మండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండిరధోత్సవం ప్రారంభం అయింది.
సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యములు, తాళం భజన కళాకారుల ప్రదర్శలు ముందు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి రధోత్సవసేవ
కనకదుర్గానగర్, కుమ్మరి పాలెం సెంటర్, కామకోటి నగర్, శంకర మఠం, విద్యాధరపురం, సొరంగమార్గం, కొత్తపేట, బ్రాహ్మణవీధి,రధం సెంటర్ మీదుగా దేవస్థానమునకు చేరుకుంటుంది.
వెండిరధంపై కొలువైన ఆది దంపతులు భక్త కోటిని అనుగ్రహించారు.
ఆది దంపతులు వేంచేసిన వెండి రధం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ),ఆలయ ఈవో వికె శీనా నాయక్, ధర్మ కర్తల మండలి సభ్యులు, స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ,వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz