ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు

0
140

*పత్రికా ప్రకటన*         

 

*ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*

 

" వెండిరధం పై ఊరేగిన ఆదిదంపతులు"

 

ఇంద్రకీలాద్రి పై వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవల్లో భాగంగా...సాయంత్రం 5 గంటలకు -శ్రీ మల్లేశ్వర మహా మండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండిరధోత్సవం ప్రారంభం అయింది.

సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యములు, తాళం భజన కళాకారుల ప్రదర్శలు ముందు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి రధోత్సవసేవ 

కనకదుర్గానగర్, కుమ్మరి పాలెం సెంటర్, కామకోటి నగర్, శంకర మఠం, విద్యాధరపురం, సొరంగమార్గం, కొత్తపేట, బ్రాహ్మణవీధి,రధం సెంటర్ మీదుగా దేవస్థానమునకు చేరుకుంటుంది.

వెండిరధంపై కొలువైన ఆది దంపతులు భక్త కోటిని అనుగ్రహించారు.

ఆది దంపతులు వేంచేసిన వెండి రధం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ),ఆలయ ఈవో వికె శీనా నాయక్, ధర్మ కర్తల మండలి సభ్యులు, స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ,వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు...
By Pagadala Venkateswar 2026-02-26 11:34:56 0 102
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల: ప్రముఖ...
By Gadiyapudi Narendra 2026-01-03 16:23:53 0 225
Punjab
Ludhiana’s Green Leap: India’s First Hydrogen-Bus Fleet
Ludhiana officially became the first city in North India to transition its entire public transit...
By Dunna Jessicaruth 2026-05-14 08:21:29 0 34
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com