ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు

0
143

*పత్రికా ప్రకటన*         

 

*ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*

 

" వెండిరధం పై ఊరేగిన ఆదిదంపతులు"

 

ఇంద్రకీలాద్రి పై వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవల్లో భాగంగా...సాయంత్రం 5 గంటలకు -శ్రీ మల్లేశ్వర మహా మండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండిరధోత్సవం ప్రారంభం అయింది.

సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యములు, తాళం భజన కళాకారుల ప్రదర్శలు ముందు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి రధోత్సవసేవ 

కనకదుర్గానగర్, కుమ్మరి పాలెం సెంటర్, కామకోటి నగర్, శంకర మఠం, విద్యాధరపురం, సొరంగమార్గం, కొత్తపేట, బ్రాహ్మణవీధి,రధం సెంటర్ మీదుగా దేవస్థానమునకు చేరుకుంటుంది.

వెండిరధంపై కొలువైన ఆది దంపతులు భక్త కోటిని అనుగ్రహించారు.

ఆది దంపతులు వేంచేసిన వెండి రధం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ),ఆలయ ఈవో వికె శీనా నాయక్, ధర్మ కర్తల మండలి సభ్యులు, స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ,వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త
తేదీ:23.04.2026 నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో...
By Sadaq Sadaq 2026-04-23 07:37:36 0 109
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-13 06:53:52 0 109
Andhra Pradesh
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-03-15 12:24:16 0 128
Andhra Pradesh
పాణ్యం నియోజకవర్గ కార్యకర్తలకు ఉత్తమ పురస్కారాలు : పాణ్యం ఎమ్మెల్యే
కర్నూలు : పాణ్యం!! పాణ్యం నియోజకవర్గంలోని 76 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్తమ...
By Hari Krishna 2025-12-30 16:38:38 0 197
Andhra Pradesh
మంత్రి కి ఘన స్వాగతం !!
కర్నూలు : పాణ్యం : కోడుమూరు :  నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార...
By Hari Krishna 2026-01-03 14:28:39 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com