హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం

0
194

చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్‌బండ్ వంటి వాటితో పాటు, ఇప్పుడు హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో HMDA నిర్మించిన ఎకో పార్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్వాల్‌గూడలో రూపుదిద్దుకున్న ఈ పార్కులో దేశవిదేశాలకు చెందిన 19 రకాల అరుదైన పక్షులు ఉన్నాయి.

‎ఇక నుంచి అరుదైన, అందమైన పక్షులను చూడాలంటే ఆఫ్రికా అడవులకో, అమెజాన్ నదీ తీరాలకో వెళ్లాల్సిన పని లేదు. నగరవాసుల కోసం హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ఎకో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవిదేశాలకు చెందిన పక్షులతో కొత్వాల్‌గూడలో ఎకోపార్క్ నిర్మించారు

‎ఎకో పార్కులో మొత్తం ఆరు ఎకరాల్లో పక్షిశాల సిద్ధమైంది. దీనిని ప్రత్యేకంగా సీతాకోకచిలుక ఆకారంలో రూపొందించారు.

‎ఈ ఎకో పార్కులో 19 రకాలకు చెందిన సుమారు 8,094 పక్షులు ఉన్నాయి.

‎ఆఫ్రికా గడ్డి మైదానాలు, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, పెరూ, అర్జెంటీనా వంటి సుదూర ప్రాంతాల్లో కనిపించే అరుదైన పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.

‎పలు రకాలైన మకావ్‌లు, కాకాటెయిల్స్, బడ్డీ, పావురాలు, ఫించ్, ఇంద్రధనుస్సు చిలుకలు, కాకాటూలు, అమెజాన్ చిలుకలు, కోనూర్స్, ఫెసెంట్స్, టురాకో, టూకాన్‌లు, మాండ్రిన్ బాతులు, క్వేకర్ చిలుకలు వంటి పలు రకాల పక్షులు ఇక్కడ ఆకర్షణగా నిలవనున్నాయి.

‎పక్షుల మనుగడకు అనువుగా ప్రత్యేకమైన గేజ్‌లు ఏర్పాటు చేసి, వాటి సహజ ఆవాసాలకు దగ్గరగా ఉండేలా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించారు.

‎పక్షిశాల ఐటీ కారిడార్‌ను, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఆనుకొని ఉండటం వల్ల నగరవాసులకు, పర్యాటకులకు సులభంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది.

‎అద్భుతమైన పక్షి ప్రదర్శనశాల హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణగా మారనుంది. పక్షుల ప్రియులకు కనుల పండుగ చేయనుంది. త్వరలో పార్క్ ప్రారంభం కానుండగా.. వీకెండ్ ప్లాన్ చేసుకునేవారు ఎకో పార్కుపై ఓ లుక్కేయండి.

Search
Categories
Read More
SURAKSHA
Ravinder Kumar IAS: Driving Development in Ladakh
The Journey Begins Strong governance is often defined by leaders who quietly transform policies...
By Fathima Safa 2026-07-23 11:54:26 0 28
Telangana
"సోబర్స్" శకం ముగిసింది.|
- 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వెస్టిండీస్ దిగ్గజం - అత్యుత్తమ ఆల్‌రౌండర్‌కు యావత్...
By Sidhu Maroju 2026-07-18 07:51:42 0 77
Andhra Pradesh
సివిల్ సప్లయిస్ హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి: AITUC.
అన్నమయ్య జిల్లాలోని సివిల్ సప్లయిస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా...
By Pagadala Venkateswar 2026-05-22 04:57:17 0 71
Andhra Pradesh
పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ
పుంగనూరు మండలం బండ్లపల్లె టీచర్ జ్యోతిలక్ష్మి, ఎలాంటి అనుమతులు లేకుండా డిసెంబర్ 3, 2024 నుంచి...
By Kothuru Murali 2026-02-13 06:18:07 0 151
Andhra Pradesh
రాగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీపీవో
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి రాగోలు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. గంగీబాబు...
By Manda Ramkumar 2026-03-28 12:34:24 0 391
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com