హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం

0
163

చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్‌బండ్ వంటి వాటితో పాటు, ఇప్పుడు హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో HMDA నిర్మించిన ఎకో పార్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్వాల్‌గూడలో రూపుదిద్దుకున్న ఈ పార్కులో దేశవిదేశాలకు చెందిన 19 రకాల అరుదైన పక్షులు ఉన్నాయి.

‎ఇక నుంచి అరుదైన, అందమైన పక్షులను చూడాలంటే ఆఫ్రికా అడవులకో, అమెజాన్ నదీ తీరాలకో వెళ్లాల్సిన పని లేదు. నగరవాసుల కోసం హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ఎకో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవిదేశాలకు చెందిన పక్షులతో కొత్వాల్‌గూడలో ఎకోపార్క్ నిర్మించారు

‎ఎకో పార్కులో మొత్తం ఆరు ఎకరాల్లో పక్షిశాల సిద్ధమైంది. దీనిని ప్రత్యేకంగా సీతాకోకచిలుక ఆకారంలో రూపొందించారు.

‎ఈ ఎకో పార్కులో 19 రకాలకు చెందిన సుమారు 8,094 పక్షులు ఉన్నాయి.

‎ఆఫ్రికా గడ్డి మైదానాలు, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, పెరూ, అర్జెంటీనా వంటి సుదూర ప్రాంతాల్లో కనిపించే అరుదైన పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.

‎పలు రకాలైన మకావ్‌లు, కాకాటెయిల్స్, బడ్డీ, పావురాలు, ఫించ్, ఇంద్రధనుస్సు చిలుకలు, కాకాటూలు, అమెజాన్ చిలుకలు, కోనూర్స్, ఫెసెంట్స్, టురాకో, టూకాన్‌లు, మాండ్రిన్ బాతులు, క్వేకర్ చిలుకలు వంటి పలు రకాల పక్షులు ఇక్కడ ఆకర్షణగా నిలవనున్నాయి.

‎పక్షుల మనుగడకు అనువుగా ప్రత్యేకమైన గేజ్‌లు ఏర్పాటు చేసి, వాటి సహజ ఆవాసాలకు దగ్గరగా ఉండేలా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించారు.

‎పక్షిశాల ఐటీ కారిడార్‌ను, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఆనుకొని ఉండటం వల్ల నగరవాసులకు, పర్యాటకులకు సులభంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది.

‎అద్భుతమైన పక్షి ప్రదర్శనశాల హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణగా మారనుంది. పక్షుల ప్రియులకు కనుల పండుగ చేయనుంది. త్వరలో పార్క్ ప్రారంభం కానుండగా.. వీకెండ్ ప్లాన్ చేసుకునేవారు ఎకో పార్కుపై ఓ లుక్కేయండి.

Search
Categories
Read More
Andhra Pradesh
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్...
By Kola Kirankumar 2026-03-31 18:28:44 0 246
Telangana
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు : నడిపెల్లి దివాకర్ రావు
ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం, ఐబీ చౌరస్తాలోని...
By Avunoori Mahesh 2026-04-14 08:17:15 0 161
Telangana
రాఖి కట్టిన కనికరించని కాకి
భరత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ 
By Prashanth Goindla 2026-04-25 10:50:09 0 117
Telangana
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై...
By Sidhu Maroju 2026-05-11 11:15:16 0 280
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com