హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం

0
197

చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్‌బండ్ వంటి వాటితో పాటు, ఇప్పుడు హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో HMDA నిర్మించిన ఎకో పార్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్వాల్‌గూడలో రూపుదిద్దుకున్న ఈ పార్కులో దేశవిదేశాలకు చెందిన 19 రకాల అరుదైన పక్షులు ఉన్నాయి.

‎ఇక నుంచి అరుదైన, అందమైన పక్షులను చూడాలంటే ఆఫ్రికా అడవులకో, అమెజాన్ నదీ తీరాలకో వెళ్లాల్సిన పని లేదు. నగరవాసుల కోసం హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ఎకో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవిదేశాలకు చెందిన పక్షులతో కొత్వాల్‌గూడలో ఎకోపార్క్ నిర్మించారు

‎ఎకో పార్కులో మొత్తం ఆరు ఎకరాల్లో పక్షిశాల సిద్ధమైంది. దీనిని ప్రత్యేకంగా సీతాకోకచిలుక ఆకారంలో రూపొందించారు.

‎ఈ ఎకో పార్కులో 19 రకాలకు చెందిన సుమారు 8,094 పక్షులు ఉన్నాయి.

‎ఆఫ్రికా గడ్డి మైదానాలు, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, పెరూ, అర్జెంటీనా వంటి సుదూర ప్రాంతాల్లో కనిపించే అరుదైన పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.

‎పలు రకాలైన మకావ్‌లు, కాకాటెయిల్స్, బడ్డీ, పావురాలు, ఫించ్, ఇంద్రధనుస్సు చిలుకలు, కాకాటూలు, అమెజాన్ చిలుకలు, కోనూర్స్, ఫెసెంట్స్, టురాకో, టూకాన్‌లు, మాండ్రిన్ బాతులు, క్వేకర్ చిలుకలు వంటి పలు రకాల పక్షులు ఇక్కడ ఆకర్షణగా నిలవనున్నాయి.

‎పక్షుల మనుగడకు అనువుగా ప్రత్యేకమైన గేజ్‌లు ఏర్పాటు చేసి, వాటి సహజ ఆవాసాలకు దగ్గరగా ఉండేలా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించారు.

‎పక్షిశాల ఐటీ కారిడార్‌ను, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఆనుకొని ఉండటం వల్ల నగరవాసులకు, పర్యాటకులకు సులభంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది.

‎అద్భుతమైన పక్షి ప్రదర్శనశాల హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణగా మారనుంది. పక్షుల ప్రియులకు కనుల పండుగ చేయనుంది. త్వరలో పార్క్ ప్రారంభం కానుండగా.. వీకెండ్ ప్లాన్ చేసుకునేవారు ఎకో పార్కుపై ఓ లుక్కేయండి.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్.
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్ 17-03-2026 Tue 15:45 | Andhra...
By Pagadala Venkateswar 2026-03-17 10:43:51 0 189
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-16 13:02:42 0 61
Business & Finance
June GST Growth Supports Arunachal's Development
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
By Navya Sree 2026-07-02 12:54:27 0 64
Andhra Pradesh
మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎస్పీ.
మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-04-21 03:07:41 0 101
Andhra Pradesh
నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం
*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*   *44వ డివిజన్ కార్పొరేటర్...
By Rajini Kumari 2026-03-09 17:28:07 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com