కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?

0
91

కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కవిత పార్టీకి ఆ పేరు ఎలా ఇస్తారు..? ఏ ప్రాతిపదికన పార్టీ పేర్లకు గుర్తింపును ఇస్తారని.. కేంద్ర ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే.. ఇదే విషయమై ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో ఆ కీలక నేత చర్చించారని తెలిసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను నేరుగా కలిస్తే అందరికీ తెలిసిపోతుందని భావించిన సదరు కీలక నేత.. ఈసీఐలో రాజకీయ పార్టీల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్‌లో పనిచేసే జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారికి ఫోన్‌ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు రాజకీయ పార్టీల పేర్ల కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ పద్ధతిలో పేర్లు ఇస్తారు? అన్న అంశాలపై ఆ అధికారి నుంచి వివరణ కోరే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ఈసీఐ పరిధిలోని వివరాలను ఫోన్ల ద్వారా గానీ.. వ్యక్తిగతంగా గానీ.. అడిగితే సమాధానం చెప్పలేమని ఆ అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఏమైనా వివరాలు కావాలంటే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే అధికారికంగా సమాధానం ఇచ్చే అవకాశముంటుందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

‎రాజకీయంగా నష్టముంటుందనే..

‎కవిత పార్టీ పేరు ‘టీఆర్‌ఎస్‌’ అని ఉంటే, అది తమ పాత పేరు కావడం వల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధినేత కేసీఆర్‌తోపాటు గులాబీ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీఐ అధికారి కీలక నేతకు వివరాలు చెప్పకపోవడంతో బీఆర్‌ఎస్‌ వర్గం తదుపరి ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. పార్టీలకు ఒకే తరహా సంక్షిప్త పేర్లు ఉన్నప్పుడు దాన్ని నిలవరించడంలో చట్టపరమైన ఇబ్బందులేంటి? ఎన్నికల సంఘం వద్ద ఈ పేరును అడ్డుకునే అవకాశాలను న్యాయ నిపుణుల ద్వారా తెలుసుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత సూచించినట్లు సమాచారం. కాగా.. టీఆర్‌ఎస్‌ సంక్షిప్త నామంతో ఇప్పటికే తన పార్టీ ఉందని, ఇప్పుడదే పేరుతో కవిత కొత్త పార్టీ ఉండటం వల్ల రాజకీయంగా తనకు ఇబ్బందులుంటాయని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో...
By Boiena Rajesh 2026-03-16 14:07:51 0 144
Telangana
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ... మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా లో నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతమైన వాతావరణంలో మొదలైన ఓటింగ్ మొదలైంది. జిల్లాలోని...
By Gangaram Rangagowni 2026-02-11 02:25:12 0 293
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 118
Andhra Pradesh
సదుము మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి,...
By Pagadala Venkateswar 2026-02-08 11:03:17 0 135
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com