కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?

0
130

కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కవిత పార్టీకి ఆ పేరు ఎలా ఇస్తారు..? ఏ ప్రాతిపదికన పార్టీ పేర్లకు గుర్తింపును ఇస్తారని.. కేంద్ర ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే.. ఇదే విషయమై ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో ఆ కీలక నేత చర్చించారని తెలిసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను నేరుగా కలిస్తే అందరికీ తెలిసిపోతుందని భావించిన సదరు కీలక నేత.. ఈసీఐలో రాజకీయ పార్టీల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్‌లో పనిచేసే జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారికి ఫోన్‌ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు రాజకీయ పార్టీల పేర్ల కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ పద్ధతిలో పేర్లు ఇస్తారు? అన్న అంశాలపై ఆ అధికారి నుంచి వివరణ కోరే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ఈసీఐ పరిధిలోని వివరాలను ఫోన్ల ద్వారా గానీ.. వ్యక్తిగతంగా గానీ.. అడిగితే సమాధానం చెప్పలేమని ఆ అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఏమైనా వివరాలు కావాలంటే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే అధికారికంగా సమాధానం ఇచ్చే అవకాశముంటుందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

‎రాజకీయంగా నష్టముంటుందనే..

‎కవిత పార్టీ పేరు ‘టీఆర్‌ఎస్‌’ అని ఉంటే, అది తమ పాత పేరు కావడం వల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధినేత కేసీఆర్‌తోపాటు గులాబీ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీఐ అధికారి కీలక నేతకు వివరాలు చెప్పకపోవడంతో బీఆర్‌ఎస్‌ వర్గం తదుపరి ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. పార్టీలకు ఒకే తరహా సంక్షిప్త పేర్లు ఉన్నప్పుడు దాన్ని నిలవరించడంలో చట్టపరమైన ఇబ్బందులేంటి? ఎన్నికల సంఘం వద్ద ఈ పేరును అడ్డుకునే అవకాశాలను న్యాయ నిపుణుల ద్వారా తెలుసుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత సూచించినట్లు సమాచారం. కాగా.. టీఆర్‌ఎస్‌ సంక్షిప్త నామంతో ఇప్పటికే తన పార్టీ ఉందని, ఇప్పుడదే పేరుతో కవిత కొత్త పార్టీ ఉండటం వల్ల రాజకీయంగా తనకు ఇబ్బందులుంటాయని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్ర‌చుర‌ణార్థం 18-12-2025   ప్ర‌జాస్వామ్య పాల‌న‌కు...
By Rajini Kumari 2025-12-18 11:13:09 0 236
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో దాడి.
మదనపల్లె రామారావు కాలనీలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో...
By Pagadala Venkateswar 2026-06-03 05:36:04 0 76
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-11-05 09:19:25 0 887
Andhra Pradesh
అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎలిజిబెత్ రేఖ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి(సి.ఐ.టి.యు)
బాపట్ల జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను వీధుల పాలు...
By Gadiyapudi Narendra 2026-02-24 16:53:13 0 313
Andhra Pradesh
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:    టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..    234 అసెంబ్లీ...
By Rajini Kumari 2026-03-30 04:38:56 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com