ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

0
201

ఎమ్మిగనూరు పట్టణంలోని సోగనూరు రోడ్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు, టిడ్కో ఎస్‌సి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్, కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు, బిజెపి అసెంబ్లీ మాజీ కో కన్వీనర్, స్థానిక బీజేపీ నేతలు,స్థానిక కూటమి నాయకులు మరియు లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అపార్ట్‌మెంట్ గృహాలను ప్రారంభించారు.

మొదటి దశలో భాగంగా 1008 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ మరో ముఖ్యమైన అడుగు ముందుకు వేసిందని ఎమ్మెల్యే గారు తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే ఈ ప్రాంతంలో కమ్యూనిటీ షాపింగ్ కాంప్లెక్స్, కూరగాయల మార్కెట్, పాఠశాలలు, పార్కులు మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గారు వెల్లడించారు.

గత వైసీపీ ప్రభుత్వం పేదలకు సంక్షేమం అందించకుండా టిడ్కో ఇళ్లను పంపిణీ చేయకుండా కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించి, తరువాత కేవలం పెయింటింగ్ పనుల పేరుతో ప్రజల ధనాన్ని వృథా చేసిందని ఆయన విమర్శించారు.అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు పట్టణంలోని 6వ వార్డు శివన్న నగర్ ప్రాంతాన్ని సందర్శించి “మన ఇల్లు – మన గౌరవం” కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-BLC) మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 650 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹2.50 లక్షల విలువైన సబ్సిడీ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా గృహ నిర్మాణం పూర్తి చేసిన శ్రీమతి ముల్లా మెహరూన్ బీ గారి ఇంటిని ఎమ్మెల్యే గారు ప్రారంభించి, వారికి సాంప్రదాయ వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారు, టిడ్కో ఎస్‌సి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్, కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు భాస్కర్ గారు ,బిజెపి నేతలు గణప వీరేష్,ఈరన్న గౌడ్, గోవిందు గౌడ్,మాజీ కౌన్సిలర్లు, పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 156
Andhra Pradesh
పెద్దారవీడు మండలం బద్వేడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య
పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య   దోర్నాల...
By Chennaiah Kati 2026-01-23 14:02:03 0 208
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 218
Telangana
నేను ఏ పార్టీ లోకి వెళ్ళను : ఎమ్మెల్యేరాజాసింగ్
     హైదరాబాద్/ గోషామహల్.   ఇటీవల జరిగిన భాజపా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక...
By Sidhu Maroju 2025-07-20 13:59:32 0 1K
Andhra Pradesh
పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక...
By Kothuru Murali 2026-03-02 03:27:23 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com