గ్యాస్ బ్లాక్ దందా బట్టబయలు.. 420 సిలిండర్లు స్వాధీనం.|

0
114

 

 

 

హైదరాబాద్‌ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. డీసీపీ టాస్క్ ఫోర్స్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ స్థాయిలో అక్రమ గ్యాస్ వ్యాపారం వెలుగులోకి వచ్చింది.

పంజగుట్ట స్మశాన వాటిక ప్రాంతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 10 మంది పై కేసులు నమోదు చేశారు.

టాస్క్ ఫోర్స్ అధికారులు ముఠా నుంచి 420 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ దందాలో ఉపయోగించిన రెండు ఆటోలు, రెండు బొలెరో వాహనాలు, ఒక ఓమినీ, రెండు డీసీఎం వాహనాలను కూడా జప్తు చేశారు.

దర్యాప్తులో భాగంగా మెట్రో హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం కూడా ఈ బ్లాక్ దందాలో పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువగా సుమారు 2100 రూపాయల విలువ గల సిలిండర్లను 6 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు వెల్లడైంది.

ఇదిలా ఉండగా  “గ్యాస్ సప్లై”  పేరుతో ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రజలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. కావాలనే తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
Gold Price Drop: కొనసాగుతున్న బంగారం ధరల పతనం... ఈరోజు రూ.9 వేలు ఢమాల్
Gold Price Down | బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. తులం బంగారం రూ.9 వేలు పడిపోతే, కిలో...
By Siva Bhaskar 2026-02-02 04:49:42 0 366
Andhra Pradesh
టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసన
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి...
By Rajini Kumari 2026-04-04 15:33:23 0 183
Andhra Pradesh
గూడూరు మండలం పొన్నకల్ గ్రామం మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం 27న ప్రారంభం
ప్రజలు కోర్కెలు తీర్చే పొన్నకల్ కాజా మినల్లా హుసైని ఉరుసు మహోత్సవాలు 27 నుంచి 29 వరకు ఉత్సవాలు...
By mahaboob basha 2025-12-17 09:58:34 0 462
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com