ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
142

సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. 

ఆదివారం వార్డు-5 పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ పార్క్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన "ఓపెన్ జిమ్' ను ఆయన కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేయగలమని, అందుకే ప్రభుత్వం కాలనీలు, బస్తీల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

స్థానిక ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సాల్మన్, కోశాధికారి సుఖ్ ధామ్, చంద్రశేఖర్, నాయకులు పెద్దాల నరసింహ, నాగేందర్ యాదవ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

#sidhumaroju

Alwal.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లి: ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులపై కుమారుడి దాడి.
నిమ్మనపల్లి మండలంలో గురువారం సాయంత్రం ఆస్తి రాసివ్వలేదన్న కారణంతో తల్లిదండ్రులపై కుమారుడు దాడి...
By Pagadala Venkateswar 2026-01-23 07:36:56 0 180
Andhra Pradesh
మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు...
By Ratna Sekhar 2026-03-11 07:04:51 0 373
Andhra Pradesh
రేవంత్ మాటలను CBN ఒప్పుకున్నట్టేనా.. బొత్స ప్రశ్న
రాయలసీమ లిప్ట్ను చంద్రబాబుతో ఆపించానని TG CM రేవంత్ చెప్పిన మాటను CBN ఖండించలేదని YCP నేత బొత్స...
By Boiena Rajesh 2026-02-27 02:09:25 0 216
Andhra Pradesh
అనధికారిక సైలెన్సర్లపై తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.
మదనపల్లెలో బైక్‌లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చుతున్న వర్క్‌షాప్‌లపై...
By Pagadala Venkateswar 2026-05-14 05:48:00 0 84
Andhra Pradesh
పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ
అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు...
By Kothuru Murali 2026-06-22 10:53:22 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com