ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
143

సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. 

ఆదివారం వార్డు-5 పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ పార్క్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన "ఓపెన్ జిమ్' ను ఆయన కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేయగలమని, అందుకే ప్రభుత్వం కాలనీలు, బస్తీల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

స్థానిక ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సాల్మన్, కోశాధికారి సుఖ్ ధామ్, చంద్రశేఖర్, నాయకులు పెద్దాల నరసింహ, నాగేందర్ యాదవ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

#sidhumaroju

Alwal.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 259
Business & Finance
Bengal Encourages Entrepreneurship and Investment Growth
At a business forum in Kolkata, West Bengal's leadership encouraged entrepreneurs to take greater...
By Navya Sree 2026-07-03 06:37:24 0 26
Andhra Pradesh
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపిన: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ఆంగ్ల నూతన సంవత్సర...
By John Baji 2025-12-31 18:32:00 0 187
Andhra Pradesh
దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్
*మంగళగిరి,* *తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,* *ది : 23-02-2026.*   *దళిత ద్రోహి జగన్...
By Rajini Kumari 2026-02-23 12:03:54 0 170
Andhra Pradesh
పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ...
By Kothuru Murali 2026-06-16 13:42:33 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com