ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
112

సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. 

ఆదివారం వార్డు-5 పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ పార్క్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన "ఓపెన్ జిమ్' ను ఆయన కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేయగలమని, అందుకే ప్రభుత్వం కాలనీలు, బస్తీల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

స్థానిక ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సాల్మన్, కోశాధికారి సుఖ్ ధామ్, చంద్రశేఖర్, నాయకులు పెద్దాల నరసింహ, నాగేందర్ యాదవ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

#sidhumaroju

Alwal.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌.
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌ 11-05-2026 Mon...
By Pagadala Venkateswar 2026-05-11 06:27:13 0 59
Telangana
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం   గోదావరిఖని ఏసీపీ...
By Pinnehasan Odela 2026-03-07 15:42:24 0 211
Manipur
Security Forces Intensify Rescue Operations for Hostages
Security forces, along with specialized sniffer dog squads, have stepped up massive combing...
By Dunna Jessicaruth 2026-05-20 09:34:35 0 33
Telangana
రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం
    హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన...
By Sidhu Maroju 2025-10-21 11:04:17 0 255
Telangana
బల్కంపేట ఆలయానికి కోటి రూపాయలు విరాళం అందించిన నితా అంబానీ
బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ విరాళం బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత...
By Vadla Egonda 2025-06-21 01:34:05 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com