జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక

0
191

ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (APCO)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తక్షణమే పునఃపరిశీలించి నిలిపివేయాలని కోరుతూ, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారు గౌరవ జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, ఐఏఎస్ గారిని మరియు గౌరవ సంయుక్త కలెక్టర్ నూరుల్, ఐఏఎస్ గారిని కలిసి ఈరోజు అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా బుట్టా రేణుక గారు మాట్లాడుతూ, ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేయడం అనేది చేనేతల అస్తిత్వం, స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని స్పష్టం చేశారు. స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ మాచాని సోమప్ప గారు తమ దూరదృష్టితో ఏర్పాటు చేసిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు చేనేతలకు స్వయం ఆధారిత వ్యవస్థను అందించాయని, వేలాది కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పించాయని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సిందే గానీ విలీనం ద్వారా బలహీనపరచకూడదని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం చంద్రబాబు.
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం   andhra Chandrababu reviews...
By Pagadala Venkateswar 2026-02-04 07:57:42 0 97
Telangana
Alwal : save hindu graveyard
    GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
By Sidhu Maroju 2025-07-08 08:25:31 0 1K
Bharat Aawaz
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
By Bharat Aawaz 2025-06-28 12:13:28 0 2K
Andhra Pradesh
పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం...
By Kothuru Murali 2026-03-02 04:07:45 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com