అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్

0
129

*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం*

*ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

++++

 

           అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపు చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

   పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. 

   

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని, ఈ సమావేశంలో ప్రజాదర్బార్‌లో వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఆయనకు తెలియజేస్తానని శాసనసభ్యులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని అందువల్ల ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజాదర్బార్‌లో తెలియజేసిన సమస్యల్లో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై ప్రజలు ఎక్కువుగా అడుగుతున్నారని, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనని చెప్పారు. ఆటోనగర్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈతో మాట్లాడతానన్నారు. ప్రజదర్బార్‌లో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, వివిద కార్పొరేషన్ల డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కి ఎదురుదెబ్బ. పోక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేము అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్‌ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు...
By Ponnala Srinivasrao 2026-05-16 04:01:26 0 73
Rajasthan
High Tech Boost: First Semiconductor Cluster In Bhiwadi
Rajasthan has achieved a major technological milestone as its first semiconductor cluster was...
By Dunna Jessicaruth 2026-05-16 08:05:54 0 73
Andhra Pradesh
అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-02-27 11:05:22 0 159
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 498
Andhra Pradesh
చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు
చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచికి జన్మదిన శుభాకాంక్షలు  చీరాల: చీరాల నియోజకవర్గం  మాజీ...
By Gadiyapudi Narendra 2025-12-28 16:18:25 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com