అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్

0
161

*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం*

*ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

++++

 

           అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపు చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

   పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. 

   

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని, ఈ సమావేశంలో ప్రజాదర్బార్‌లో వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఆయనకు తెలియజేస్తానని శాసనసభ్యులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని అందువల్ల ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజాదర్బార్‌లో తెలియజేసిన సమస్యల్లో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై ప్రజలు ఎక్కువుగా అడుగుతున్నారని, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనని చెప్పారు. ఆటోనగర్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈతో మాట్లాడతానన్నారు. ప్రజదర్బార్‌లో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, వివిద కార్పొరేషన్ల డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Gopesh Agrawal IPS: Leading Kerala with Vision and Valor
Gopesh Agrawal, IPS – A Leader Committed to Justice and Public Service...
By Fathima Safa 2026-07-10 10:29:30 0 78
Andhra Pradesh
రహదారులపై జంతువులను వదిలితే కఠిన చర్యలు: కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  రహదారులపై జంతువులు వదిలితే కఠిన చర్యలు• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-09 13:21:13 0 240
Telangana
పాపన్న గౌడ్ వర్ధంతి… గౌడ సంఘంతో కలిసి ఘన నివాళులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని యాదవ్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న...
By Sidhu Maroju 2026-04-02 11:40:39 0 221
Andhra Pradesh
జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబు
కువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్...
By Benguluri Madhubabu 2026-05-16 12:01:57 0 237
Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ...
By Benguluri Madhubabu 2026-02-18 03:42:28 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com