విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

0
221

పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి. ...........          

 

 

 భవానీపురం పోలీస్ కాలనీలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.. శనివారం ఆయన స్తానిక కూటమి నాయకులతో కలిసి 43 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 42, 43, 44, 45 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్ కు లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ రావడం, సరఫరాలో ఎగుడు దిగుడు సమస్యలు వస్తున్నాయి.. ఈ సమస్యలను అధికమించేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 6.2 కోట్ల హడ్కో నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం, రాబోయే వేసవి నీ దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరామనీ తెలిపారు. విద్యుత్ ను ఆదా చేస్తే. ఉత్పత్తి చేసినట్లే నని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలనీ కోరారు... ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా రామరాజ్యనగర్ సెక్షన్ పరిధిలోని 42, 43, 44, 45, డివిజన్ల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందనీ తెలిపారు.. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఈఈ కొండలరావు, డీఈ గోవిందరాజులు , మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, బుల్లా విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొలేపల్లి కోటేశ్వరరావు, బిజెపి మండలాద్యాక్షుడు పగడాల కృష్ణ, జనసేన నాయకురాలు తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
దాచేపల్లిలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్ – విద్యుత్ షాక్‌తో హింస
దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం...
By Bharat Aawaz 2025-08-12 05:56:55 0 802
Andhra Pradesh
కడివెళ్ల గ్రామానికి చర్చి ఓపెనింగ్ లో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-05-04 13:44:38 0 122
Andhra Pradesh
పుంగనూరు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
By Kothuru Murali 2026-03-03 11:54:59 0 143
Andhra Pradesh
బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా...
By Pagadala Venkateswar 2026-02-13 11:25:30 0 175
Andhra Pradesh
మెడికల్ కాలేజీ లా నిర్మాణంలో పిపిపి విధానంపై వైసీపీ అభ్యర్థులకు ప్రచారం అనగానే సత్యప్రసాద్
రేపల్లె 16.12.2025 అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
By Rajini Kumari 2025-12-16 10:01:42 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com