విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

0
119

పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి. ...........          

 

 

 భవానీపురం పోలీస్ కాలనీలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.. శనివారం ఆయన స్తానిక కూటమి నాయకులతో కలిసి 43 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 42, 43, 44, 45 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్ కు లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ రావడం, సరఫరాలో ఎగుడు దిగుడు సమస్యలు వస్తున్నాయి.. ఈ సమస్యలను అధికమించేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 6.2 కోట్ల హడ్కో నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం, రాబోయే వేసవి నీ దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరామనీ తెలిపారు. విద్యుత్ ను ఆదా చేస్తే. ఉత్పత్తి చేసినట్లే నని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలనీ కోరారు... ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా రామరాజ్యనగర్ సెక్షన్ పరిధిలోని 42, 43, 44, 45, డివిజన్ల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందనీ తెలిపారు.. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఈఈ కొండలరావు, డీఈ గోవిందరాజులు , మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, బుల్లా విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొలేపల్లి కోటేశ్వరరావు, బిజెపి మండలాద్యాక్షుడు పగడాల కృష్ణ, జనసేన నాయకురాలు తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 11:33:16 0 78
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Andhra Pradesh
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారు
గుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ...
By Kola Kirankumar 2026-03-27 12:02:07 0 174
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com