విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

0
220

పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి. ...........          

 

 

 భవానీపురం పోలీస్ కాలనీలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.. శనివారం ఆయన స్తానిక కూటమి నాయకులతో కలిసి 43 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 42, 43, 44, 45 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్ కు లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ రావడం, సరఫరాలో ఎగుడు దిగుడు సమస్యలు వస్తున్నాయి.. ఈ సమస్యలను అధికమించేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 6.2 కోట్ల హడ్కో నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం, రాబోయే వేసవి నీ దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరామనీ తెలిపారు. విద్యుత్ ను ఆదా చేస్తే. ఉత్పత్తి చేసినట్లే నని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలనీ కోరారు... ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా రామరాజ్యనగర్ సెక్షన్ పరిధిలోని 42, 43, 44, 45, డివిజన్ల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందనీ తెలిపారు.. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఈఈ కొండలరావు, డీఈ గోవిందరాజులు , మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, బుల్లా విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొలేపల్లి కోటేశ్వరరావు, బిజెపి మండలాద్యాక్షుడు పగడాల కృష్ణ, జనసేన నాయకురాలు తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ...
By Gadiyapudi Narendra 2026-02-21 07:14:22 0 174
Andhra Pradesh
రెవిన్యూ సిబ్బందితో సమీక్ష : కర్నూలు కలెక్టర్
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు డివిజన్ లో ...
By Hari Krishna 2026-01-08 08:12:13 0 192
Andhra Pradesh
విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విజయవాడ: రాష్ట్రంలో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్...
By Bharat Aawaz 2025-10-14 06:22:48 0 1K
Andhra Pradesh
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో...
By Gadiyapudi Narendra 2026-01-08 13:59:46 0 209
Telangana
శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్...
By Sidhu Maroju 2025-12-05 04:16:42 0 616
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com