విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

0
118

పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి. ...........          

 

 

 భవానీపురం పోలీస్ కాలనీలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.. శనివారం ఆయన స్తానిక కూటమి నాయకులతో కలిసి 43 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 42, 43, 44, 45 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్ కు లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ రావడం, సరఫరాలో ఎగుడు దిగుడు సమస్యలు వస్తున్నాయి.. ఈ సమస్యలను అధికమించేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 6.2 కోట్ల హడ్కో నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం, రాబోయే వేసవి నీ దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరామనీ తెలిపారు. విద్యుత్ ను ఆదా చేస్తే. ఉత్పత్తి చేసినట్లే నని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలనీ కోరారు... ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా రామరాజ్యనగర్ సెక్షన్ పరిధిలోని 42, 43, 44, 45, డివిజన్ల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందనీ తెలిపారు.. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఈఈ కొండలరావు, డీఈ గోవిందరాజులు , మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, బుల్లా విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొలేపల్లి కోటేశ్వరరావు, బిజెపి మండలాద్యాక్షుడు పగడాల కృష్ణ, జనసేన నాయకురాలు తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Karnataka
ಕಾಸ್ಟ್ ಸರ್ವೇ: ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದನೆ
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಹೊಸ ಜಾತಿ ಸರ್ವೇ (Caste Survey)ಗಾಗಿ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದಿಸಿದೆ. ಸುಮಾರು 1.65...
By Pooja Patil 2025-09-11 09:41:12 0 201
Andhra Pradesh
సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి మాజీ ఎంపీ కంభంపాటి పరామర్శ
పత్రికా ప్రకటన    మచిలీపట్నం డిసెంబర్ 28: -----------   రాష్ట్ర ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-29 09:34:24 0 110
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి హుండీల ఆదాయం 2.60 కోట్లు
విషయం: ఇంద్రకీలాద్రి అమ్మవారి హుండీ ఆదాయం వెల్లడి - 16 రోజులకు రూ. 2.60 కోట్లు.  ...
By Rajini Kumari 2026-01-19 11:08:39 0 96
Telangana
తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా...
By Prashanth Goindla 2026-02-16 05:50:34 0 170
Andhra Pradesh
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-21 11:54:00 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com