విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

0
171

పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి. ...........          

 

 

 భవానీపురం పోలీస్ కాలనీలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.. శనివారం ఆయన స్తానిక కూటమి నాయకులతో కలిసి 43 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 42, 43, 44, 45 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్ కు లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ రావడం, సరఫరాలో ఎగుడు దిగుడు సమస్యలు వస్తున్నాయి.. ఈ సమస్యలను అధికమించేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 6.2 కోట్ల హడ్కో నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం, రాబోయే వేసవి నీ దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరామనీ తెలిపారు. విద్యుత్ ను ఆదా చేస్తే. ఉత్పత్తి చేసినట్లే నని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలనీ కోరారు... ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు ద్వారా రామరాజ్యనగర్ సెక్షన్ పరిధిలోని 42, 43, 44, 45, డివిజన్ల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందనీ తెలిపారు.. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఈఈ కొండలరావు, డీఈ గోవిందరాజులు , మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, బుల్లా విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొలేపల్లి కోటేశ్వరరావు, బిజెపి మండలాద్యాక్షుడు పగడాల కృష్ణ, జనసేన నాయకురాలు తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ జరుపుకుంటున్నారు.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-14 08:43:50 0 142
Andhra Pradesh
తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????
*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*   హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం...
By Rajini Kumari 2025-12-27 10:23:56 0 178
Andhra Pradesh
ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్...
By Pagadala Venkateswar 2026-01-21 06:05:37 0 150
Andhra Pradesh
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర...
By Pagadala Venkateswar 2026-02-16 11:01:53 0 218
Telangana
పొంగులేటి సమక్షంలో ఏదులాపురం ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనిత...
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ఏదులాపురం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Krishna Balina 2026-02-23 09:07:19 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com