నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్

0
153

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ ఆటోలో ప్రయాణించి సంఘం థియేటర్ వద్ద దిగింది. దిగే సమయంలో ఆమె వద్ద ఉన్న మూడున్నర సవర్ల బంగారు తాళిబొట్టు తాడు ఆటోలోనే చేజారిపోయింది.
బాధితురాలు జంగిలి లక్ష్మి, జాండ్రపేట సీతానగరం రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్నారు. తాను ప్రయాణించిన ఆటోలో తాళిబొట్టు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్న ఆమె ఆందోళనకు గురయ్యారు.
ఆటో డ్రైవర్ మొగిలి రాజు తన వాహనంలో బంగారు తాళిబొట్టు కనిపించడంతో బాధ్యతగా వ్యవహరించి యజమానిని వెతికే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన ఆ తాళిబొట్టును చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించారు.
వన్‌టౌన్ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించి బాధితురాలిని గుర్తించారు. నేడు జంగిలి లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వచ్చి అవసరమైన ఆధారాలు సమర్పించగా, ఆమెకు తాళిబొట్టును తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ మొగిలి రాజును, సీఐ, ఎస్, సుబ్బారావు, అభినందించారు. పరాయి సొమ్ముపై ఆశపడకుండా బాధ్యతగా వ్యవహరించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
నకిలీ ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా తయారీ చేస్తున్న...
By BABJI DADALA 2026-01-27 12:06:03 0 354
Andhra Pradesh
12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2025-12-31 10:45:33 0 356
Telangana
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : కుమార్ దీపక్ ఐఏఎస్
మంచిర్యాల :ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృత్వం కార్యక్రమం...
By Avunoori Mahesh 2026-04-08 10:17:24 0 189
Telangana
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...
By Sidhu Maroju 2026-03-28 06:50:31 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com