రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి

3
2K

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ తో పాటు ఎస్సీ ఎస్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సింగరేణి ఆర్జి వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సతి సమేతంగా హాజరై శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ ప్రాంతంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న వేడుకలకు ముఖ్య అతిథులుగా వేరు వేరుగా వీరు హాజరయ్యారు. గోదావరిఖని లోని ప్రధాన కోదండ రామాలయానికి ఎమ్మెల్యే తన సతీమణితో పట్టు వస్త్రాలతో తలంబ్రాలను నెత్తిపై తాంబూలంలో పెట్టుకొని వచ్చి బ్రాహ్మణ పురోహితులకు రామాలయంలో తలంబ్రాలను అందజేశారు. అర్జీ వన్ జనరల్ మేనేజర్ జిఎం కాలనీ, శారద నగర్ ఏరియాలో ఉండే దేవాలయాలకు అతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు. అక్కడి భక్తులు అడిగిన సౌకర్యాలను తప్పకుండా సమకూరుస్తానని జిఎం లలిత్ కుమార్ హామీ ఇచ్చారు. అలాగే జిఎం కాలనీలో ఉండే ఆంజనేయస్వామి ఆలయంలో వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60 డివిజనల్ లలో ఉండేటువంటి ఆంజనేయస్వామి దేవాలయాల వద్ద ఎనిమిదవ కాలనీ, విట్టల్ నగర్, తిలక్ నగర్,  కళ్యాణ్ నగర్, గౌతమి నగర్, ద్వారకా నగర్ ఆ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా జైశ్రీరామ్ అంటూ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతల కొడుతూ ప్రతి దేవాలయాల వద్ద వేలాది మంది భక్తులతో పూజలు నిర్వహించారు. 

రంగు శ్రీనివాస్ 

రామగుండం మండలం రిపోర్టర్

పెద్దపల్లి జిల్లా 

Like
1
Search
Categories
Read More
Telangana
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా...
By Bittu Bittu 2025-12-22 12:55:24 0 238
Andhra Pradesh
మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-02 03:16:24 0 92
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో గంజాయి మరియు ఇతరత్రా మారకద్రవ్యాలు విద్యార్థుల అవగాహన రాష్ డ్రైవింగ్ హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ జరిగినది. గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో జరిగినవి...
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 26.12.2025* _*// “సంకల్పం” కార్యక్రమంలో భాగంగా...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:43:07 0 191
Andhra Pradesh
రాబోయే మూడు నెలల్లోKBN కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు
*ప్ర‌చుర‌ణార్థం* *28-12-2025*   *రాబోయే మూడు నెల‌ల్లో కె.బి.ఎన్. కాలేజీలో...
By Rajini Kumari 2025-12-28 10:00:39 0 110
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com