రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి

3
2K

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ తో పాటు ఎస్సీ ఎస్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సింగరేణి ఆర్జి వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సతి సమేతంగా హాజరై శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ ప్రాంతంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న వేడుకలకు ముఖ్య అతిథులుగా వేరు వేరుగా వీరు హాజరయ్యారు. గోదావరిఖని లోని ప్రధాన కోదండ రామాలయానికి ఎమ్మెల్యే తన సతీమణితో పట్టు వస్త్రాలతో తలంబ్రాలను నెత్తిపై తాంబూలంలో పెట్టుకొని వచ్చి బ్రాహ్మణ పురోహితులకు రామాలయంలో తలంబ్రాలను అందజేశారు. అర్జీ వన్ జనరల్ మేనేజర్ జిఎం కాలనీ, శారద నగర్ ఏరియాలో ఉండే దేవాలయాలకు అతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు. అక్కడి భక్తులు అడిగిన సౌకర్యాలను తప్పకుండా సమకూరుస్తానని జిఎం లలిత్ కుమార్ హామీ ఇచ్చారు. అలాగే జిఎం కాలనీలో ఉండే ఆంజనేయస్వామి ఆలయంలో వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60 డివిజనల్ లలో ఉండేటువంటి ఆంజనేయస్వామి దేవాలయాల వద్ద ఎనిమిదవ కాలనీ, విట్టల్ నగర్, తిలక్ నగర్,  కళ్యాణ్ నగర్, గౌతమి నగర్, ద్వారకా నగర్ ఆ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా జైశ్రీరామ్ అంటూ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతల కొడుతూ ప్రతి దేవాలయాల వద్ద వేలాది మంది భక్తులతో పూజలు నిర్వహించారు. 

రంగు శ్రీనివాస్ 

రామగుండం మండలం రిపోర్టర్

పెద్దపల్లి జిల్లా 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఈరోజు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు...
By Benguluri Madhubabu 2026-02-02 06:43:13 0 199
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ...
By Kothuru Murali 2026-04-05 07:18:29 0 76
Telangana
రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం
*రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం*   ...
By Ellandula Sandeep 2026-01-07 15:43:31 0 289
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com