తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్

0
214

ప్రెస్ నోట్.

*రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన*

*శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న కవిత దంపతులు*

*అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం*

*శ్రీరామ నవమి సందర్భంగా డిచ్ పల్లి, బోధన్,ఆర్మూర్, పోచంపాడు, జగిత్యాల, కోరుట్ల రామాలయాల్లో కవిత దంపతుల తరఫున పట్టు వస్త్రాలు.* 

శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేయనున్నారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా ఆమె చేయనున్న ప్రకటనపై ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అంతకు ముందు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో తన భర్త దేవనపల్లి అనిల్ తో కలిసి కవిత పాల్గొంటారు. శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. 

*పలు రామాలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ*

ఏటా శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజవవర్గ పరిధిలోని రామాలయాల్లో కవిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్ఫించటం ఆనవాయితీ. ఈ ఏడాది రఘనాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్ పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల్ ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ రామాలయాల్లో కవిత దంపతుల తరఫున వారి ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కవిత గారితో పాటు జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ...
By Boiena Rajesh 2026-03-07 02:40:50 0 180
Andhra Pradesh
నెల్లూరు రూరల్ వైసీపీకి రాజీనామాల పరంపర
*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర*  *ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత...
By Rajini Kumari 2025-12-21 12:32:20 0 188
Telangana
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-01-26 12:37:20 0 126
Andhra Pradesh
అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-20 05:37:39 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com