తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్

0
380

ప్రెస్ నోట్.

*రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన*

*శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న కవిత దంపతులు*

*అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం*

*శ్రీరామ నవమి సందర్భంగా డిచ్ పల్లి, బోధన్,ఆర్మూర్, పోచంపాడు, జగిత్యాల, కోరుట్ల రామాలయాల్లో కవిత దంపతుల తరఫున పట్టు వస్త్రాలు.* 

శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేయనున్నారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా ఆమె చేయనున్న ప్రకటనపై ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అంతకు ముందు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో తన భర్త దేవనపల్లి అనిల్ తో కలిసి కవిత పాల్గొంటారు. శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. 

*పలు రామాలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ*

ఏటా శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజవవర్గ పరిధిలోని రామాలయాల్లో కవిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్ఫించటం ఆనవాయితీ. ఈ ఏడాది రఘనాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్ పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల్ ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ రామాలయాల్లో కవిత దంపతుల తరఫున వారి ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కవిత గారితో పాటు జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
శీర్షిక: ప్రజలతో మమేకమవుతున్న తెలంగాణ పోలీసులు - కమ్యూనిటీ పోలీసింగ్
తెలంగాణ పోలీసుల ప్రధాన లక్ష్యం ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం. ఈ క్రమంలో, పోలీస్ అధికారులు...
By Kalaga Sailaja 2026-07-01 07:24:53 0 77
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-03-07 09:24:08 0 145
Andhra Pradesh
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
By Benguluri Madhubabu 2026-03-08 13:19:01 0 179
Andhra Pradesh
రొంపిచర్ల మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్...
By Kothuru Murali 2026-04-26 10:38:46 0 91
Telangana
హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం
చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి...
By Ponnala Srinivasrao 2026-03-31 01:46:41 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com