హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం

0
90

చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్‌బండ్ వంటి వాటితో పాటు, ఇప్పుడు హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో HMDA నిర్మించిన ఎకో పార్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్వాల్‌గూడలో రూపుదిద్దుకున్న ఈ పార్కులో దేశవిదేశాలకు చెందిన 19 రకాల అరుదైన పక్షులు ఉన్నాయి.

‎ఇక నుంచి అరుదైన, అందమైన పక్షులను చూడాలంటే ఆఫ్రికా అడవులకో, అమెజాన్ నదీ తీరాలకో వెళ్లాల్సిన పని లేదు. నగరవాసుల కోసం హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ఎకో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవిదేశాలకు చెందిన పక్షులతో కొత్వాల్‌గూడలో ఎకోపార్క్ నిర్మించారు

‎ఎకో పార్కులో మొత్తం ఆరు ఎకరాల్లో పక్షిశాల సిద్ధమైంది. దీనిని ప్రత్యేకంగా సీతాకోకచిలుక ఆకారంలో రూపొందించారు.

‎ఈ ఎకో పార్కులో 19 రకాలకు చెందిన సుమారు 8,094 పక్షులు ఉన్నాయి.

‎ఆఫ్రికా గడ్డి మైదానాలు, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, పెరూ, అర్జెంటీనా వంటి సుదూర ప్రాంతాల్లో కనిపించే అరుదైన పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.

‎పలు రకాలైన మకావ్‌లు, కాకాటెయిల్స్, బడ్డీ, పావురాలు, ఫించ్, ఇంద్రధనుస్సు చిలుకలు, కాకాటూలు, అమెజాన్ చిలుకలు, కోనూర్స్, ఫెసెంట్స్, టురాకో, టూకాన్‌లు, మాండ్రిన్ బాతులు, క్వేకర్ చిలుకలు వంటి పలు రకాల పక్షులు ఇక్కడ ఆకర్షణగా నిలవనున్నాయి.

‎పక్షుల మనుగడకు అనువుగా ప్రత్యేకమైన గేజ్‌లు ఏర్పాటు చేసి, వాటి సహజ ఆవాసాలకు దగ్గరగా ఉండేలా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించారు.

‎పక్షిశాల ఐటీ కారిడార్‌ను, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఆనుకొని ఉండటం వల్ల నగరవాసులకు, పర్యాటకులకు సులభంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది.

‎అద్భుతమైన పక్షి ప్రదర్శనశాల హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణగా మారనుంది. పక్షుల ప్రియులకు కనుల పండుగ చేయనుంది. త్వరలో పార్క్ ప్రారంభం కానుండగా.. వీకెండ్ ప్లాన్ చేసుకునేవారు ఎకో పార్కుపై ఓ లుక్కేయండి.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*     *పత్రికా...
By Rajini Kumari 2026-02-05 07:41:38 0 113
Telangana
భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
కరీంనగర్ జిల్లా  *భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...* కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం...
By Thalakokkula Sadanandam 2026-03-21 07:45:53 1 313
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ డే సందర్భంగా పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *ది.26.12.2025* _*// "పోలీస్ గ్రీవెన్స్ డే"లో పోలీస్ సిబ్బంది వినతులు...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:49:51 0 190
Andhra Pradesh
పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం...
By Kothuru Murali 2026-03-02 04:07:45 0 71
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com