ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు.. ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం

0
154

హైదరాబాద్‌కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని FAIMA, HRDA వంటి వైద్య సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఓఆర్ఎస్ లేబులింగ్ లోపాలపై ఆమె చేసిన పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నమని ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రోగుల భద్రత కోసం గళమెత్తిన వైద్యురాలికి అండగా నిలుస్తామని, నోటీసులు వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు సిద్ధమవుతామని వైద్య సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం నోటీసులు వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు

ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) లేబులింగ్ లోపాలపై పోరాటం చేసి విజయం సాధించిన హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్ నోటీసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్ల లేబులింగ్‌లో సంస్కరణలు ఉండాలని, ప్రజారోగ్యం దృష్ట్యా తప్పుదోవ పట్టించే ఉత్పత్తులపై ఆమె చేసిన సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాలపై ఆగ్రహించిన కొన్ని ఫార్మా సంస్థలు ఈ నోటీసులు పంపగా.. ఈ చర్యను డాక్టర్ల వృత్తిపరమైన స్వేచ్ఛను హరించడమేనని వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

‎డాక్టర్ శివరంజని లేవనెత్తిన అంశాలు పూర్తిగా రోగుల భద్రత, శిశువుల ఆరోగ్యానికి సంబంధించినవని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ( FAIMA ) పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన ఓఆర్ఎస్‌కు బదులుగా.. కేవలం గ్లూకోజ్ కలిపిన ఉత్పత్తులను ప్రజలకు విక్రయించడం వల్ల అనర్థాలు జరుగుతాయని హెచ్చరించటం ఒక వైద్యురాలిగా ఆమె బాధ్యత అని ఫైమా స్పష్టం చేసింది. ఇలాంటి నోటీసుల ద్వారా వైద్యులను భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడింది.

‎తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ , జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సైతం ఈ నోటీసులను తీవ్రంగా ఖండించాయి. పేషెంట్ల ఆరోగ్యం కోసం పోరాడే డాక్టర్లను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అసోసియేనష్ ప్రతినిధులు పేర్కొన్నారు. హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఒక డాక్టర్ సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నప్పుడు ఆమెను అడ్డుకోవడం అంటే సమాజ ఆరోగ్యానికి విఘాతం కలిగించడమేనని విమర్శించారు. ఈ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా వైద్య సంఘాలతో సమన్వయం చేసుకుని భారీ ఎత్తున నిరసనలు చేపడతామని అసోసియేషన్ల ప్రతినిధులు హెచ్చరించాయి. వైద్యులపై జరుగుతున్న ఇలాంటి కార్పొరేట్ బెదిరింపులకు వ్యతిరేకంగా న్యాయపరంగా కూడా పోరాడతామని వారు స్పష్టం చేశారు.

‎కాగా, మార్కెట్‌లో లభించే చాలా డ్రింక్స్ ఓఆర్ఎస్ తరహాలోనే ప్యాక్ చేసి ఉండటం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఎస్‌ పేరిట జరుగుతున్న విచ్చలవిడి దందాపై డాక్టర్ శివరంజిని సంతోష్‌ ఎనిమిదేండ్లుగా పోరాడుతున్నారు. ఓఆర్‌ఎస్‌ పేరిట జరుగుతున్న అమ్మకాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకు లేఖ రాశారు. దీంతో మార్కెట్‌లో ఓఆర్‌ఎస్‌ పేరిట సాగిస్తున్న దందాపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఉక్కుపాదం మోపింది. ఇక నుంచి ఆయా బ్రాండ్లు 'ఓఆర్‌ఎస్‌' అనే పదాన్ని తమ ఉత్పత్తులపై ఫ్రింట్ చేయటానికి వీళ్లేదని గతేడాది చివర్లో ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తయారు చేసే తమ ఉత్పత్తులపై 'డబ్ల్యూహెచ్‌వో రికమండ్ చేసిన ఓఆర్‌ఎస్‌ ఫార్ములా' కాదు అని ముద్రించాలని సూచించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం
కర్నూలు !! డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకంతాడేపల్లిగూడెం డా....
By Hari Krishna 2025-12-12 17:23:28 0 282
Telangana
డిలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే, దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర...
By Avunoori Mahesh 2026-04-15 04:45:24 0 163
Andhra Pradesh
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
By mahaboob basha 2025-09-30 23:57:17 0 275
Andhra Pradesh
'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'
పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు....
By Manda Ramkumar 2026-03-28 06:28:37 0 323
Andhra Pradesh
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు.
పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-04-10 06:06:50 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com