"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|

0
340

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 

మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 

దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు కాల్పులకు తెగబడి సిబ్బందిని అదుపులోకి తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. 

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుల ఫోటోలను కరీంనగర్ పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.

పోస్టర్‌లో ఉన్న ఐదుగురు అనుమానితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ పోస్టర్‌లోని వివరాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అల్వాల్ పి‌ఎస్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

పోస్టర్‌లో కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సంప్రదింపు నంబర్లు కూడా ఇవ్వబడిన నేపథ్యంలో, నిందితుల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ఆ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు, లేక అత్యవసర నంబర్ 100కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

నిందితులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ప్రజల సహకారంతో ఈ సంచలన దోపిడీ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 139
Andhra Pradesh
భవాని దీక్షలు విరమణ కార్యక్రమం మొదటి రోజు
నిజం: భవానీ దీక్ష విరమణ మొదటి రోజు కార్యక్రమాలు              ...
By Rajini Kumari 2025-12-12 17:06:49 0 267
Telangana
Hyderabad Metro Expansion Driving Urban Growth Forward
The expansion of the Hyderabad Metro is playing a significant role in transforming the city's...
By Fathima Safa 2026-06-20 10:35:16 0 132
Andhra Pradesh
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో...
By Pagadala Venkateswar 2026-02-04 07:34:06 0 159
Telangana
ప్రజా కలలను బ్రతికించుకుందాం
------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల...
By Bheeshman King 2026-04-07 11:36:57 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com