సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు

0
204

మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్

నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రముఖులు అవుసుల సాయి నందు చారి, సహ ప్రముఖుడు కేసరి ముమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీని ప్రకటించారు. సంస్థ బలోపేతం, యువతలో దేశభక్తి, సేవా కార్యక్రమాలపై అవగాహన పెంపొందించేందుకు కమిటీ కృషి చేయాలని వారు సూచించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బజరంగ్ దళ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. యువత ముందుకు వచ్చి సంస్థ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి సృజన్ గౌడ్, రోహిత్ రెడ్డి, అభి యాదవ్, అరవింద్ గౌడ్, పాశం మనిషి, శశిధర్ రెడ్డి, దుర్గం చందు, యుగంధర్ రెడ్డి, సన్నీ యాదవ్, కార్యకర్తలు మరియు యువకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన...
By Chennaiah Kati 2026-02-03 18:13:35 0 193
Fashion & Beauty
Savory Gourmands: The New Wave in Fragrance
The fragrance industry is experiencing a literal taste evolution as sweet, sugary scents take a...
By Dunna Jessicaruth 2026-05-19 07:33:08 0 31
Telangana
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం
ఓటుకు నోటు కేసులో  మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా...
By Ponnala Srinivasrao 2026-04-23 00:43:49 0 79
Telangana
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు...
By Avunoori Mahesh 2026-05-15 02:46:05 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com