Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.

0
128

విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

 

విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రమావిత’ అనే పాటను ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని మోదీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుంది" అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఒక తెలుగు భక్తిగీతాన్ని ప్రశంసించడంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది.

 

ఈ పరిణామంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి, ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల పరిధిలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
నందవరం మండల పరిధిలోని వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి నాయకులు...
By Boya Dasthagiri 2026-04-02 11:14:35 0 251
Telangana
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా...
By Avunoori Mahesh 2026-04-11 06:30:42 0 151
Andhra Pradesh
అమ్మవారి కోవెల కి విచ్చేసినPV సింధు
బ్యాట్మెంటన్ స్టార్ పీవీ సింధు గారు ఈరోజు శ్రీ అమ్మవారి హారతులు అనంతరం దర్శనమునకు విచ్చేసినారు......
By Rajini Kumari 2025-12-23 07:42:48 0 157
Andhra Pradesh
దుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ
*ప్రెస్ నోట్*   *దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ*  ...
By Rajini Kumari 2025-12-21 14:11:16 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com