Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.

0
91

విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

 

విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రమావిత’ అనే పాటను ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని మోదీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుంది" అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఒక తెలుగు భక్తిగీతాన్ని ప్రశంసించడంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది.

 

ఈ పరిణామంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి, ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.

Search
Categories
Read More
Telangana
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారు...
By Bouth Arun 2026-01-17 18:38:43 0 260
Andhra Pradesh
పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక...
By Kothuru Murali 2026-01-29 08:51:21 0 110
Telangana
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల...
By Bittu Bittu 2025-12-25 02:27:55 0 418
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com