*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*

0
271

 

 

 

 ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదోని ఆర్డీవో గారికి ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర మరియు జిల్లా కార్యదర్శులు షాహిద్ ఆఫ్రిది, ప్రదీప్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటూ డొనేషన్ల రూపంలో వేలకు వేలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే కొన్ని స్కూల్స్లో టీచర్ల కు అడ్మిషన్లు చేయాలని వేధిస్తున్నారని కనీసం ఒక్క టీచర్కు ఐదు అడ్మిషన్ చేసేలా ఒత్తిడి చేస్తూన్నారు వారన్నారు. కొన్ని స్కూల్స్ అయితే మౌలిక వసతులు లేకున్నా తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని ఇంత జరుగుతున్న కూడా విద్యాధికారులు అటువంటి స్కూల్ లపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషన్ సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Manipur
Torrential Rains Trigger Landslides and Floods in Manipur
Heavy and continuous rainfall has triggered severe landslides across key routes between...
By Bharat Aawaz 2025-07-17 08:19:15 0 1K
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:31 0 37
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 300
Uttar Pradesh
CM Yogi Felicitates Instructors, Touts 96% School Infrastructure Upgrade
Uttar Pradesh Chief Minister Yogi Adityanath addressed a felicitation ceremony for part-time...
By Dunna Jessicaruth 2026-05-18 10:14:55 0 90
Andhra Pradesh
పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి...
By Kothuru Murali 2026-04-16 17:18:55 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com