*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*

0
243

 

 

 

 ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదోని ఆర్డీవో గారికి ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర మరియు జిల్లా కార్యదర్శులు షాహిద్ ఆఫ్రిది, ప్రదీప్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటూ డొనేషన్ల రూపంలో వేలకు వేలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే కొన్ని స్కూల్స్లో టీచర్ల కు అడ్మిషన్లు చేయాలని వేధిస్తున్నారని కనీసం ఒక్క టీచర్కు ఐదు అడ్మిషన్ చేసేలా ఒత్తిడి చేస్తూన్నారు వారన్నారు. కొన్ని స్కూల్స్ అయితే మౌలిక వసతులు లేకున్నా తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని ఇంత జరుగుతున్న కూడా విద్యాధికారులు అటువంటి స్కూల్ లపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషన్ సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం...
By mahaboob basha 2025-06-14 14:43:16 0 1K
Andhra Pradesh
Job Mela in A. P. For ugadi
📢 *ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ – 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు*    అమరావతి :...
By G k Nookala 2026-03-15 09:07:30 0 128
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com