*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*

0
270

 

 

 

 ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదోని ఆర్డీవో గారికి ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర మరియు జిల్లా కార్యదర్శులు షాహిద్ ఆఫ్రిది, ప్రదీప్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటూ డొనేషన్ల రూపంలో వేలకు వేలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే కొన్ని స్కూల్స్లో టీచర్ల కు అడ్మిషన్లు చేయాలని వేధిస్తున్నారని కనీసం ఒక్క టీచర్కు ఐదు అడ్మిషన్ చేసేలా ఒత్తిడి చేస్తూన్నారు వారన్నారు. కొన్ని స్కూల్స్ అయితే మౌలిక వసతులు లేకున్నా తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని ఇంత జరుగుతున్న కూడా విద్యాధికారులు అటువంటి స్కూల్ లపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషన్ సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ప్రభుత్వ అతిథి హోదాలో...
By Chennaiah Kati 2026-01-25 07:18:49 0 188
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 277
Telangana
వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్...
By Avunoori Mahesh 2026-05-06 15:18:46 0 170
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 173
Business & Finance
Working Capital Can Make or Break Your Business
Working capital is the lifeblood of every business, ensuring smooth day-to-day operations by...
By Navya Sree 2026-07-10 06:42:38 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com