పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్: విద్యార్థుల క్రమశిక్షణకు వ్యాయామ విద్య అవసరం.

0
140

ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical Education) విభాగంలో పీఈటీ పోస్టులు చూపించకపోవడం శోచనీయమని అన్నమయ్య జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్ బాబు అన్నారు. ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం తప్ప ఆచరణలో శూన్యమని, విద్యార్థులలో క్రమశిక్షణ లోపిస్తోందని, ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పీఈటీ పోస్టులను, ఉన్నత పాఠశాలలకు ఎస్ఏ (పీఈ) పోస్టులను మంజూరు చేసి, రాబోయే డీఎస్సీ 2026 ద్వారా భర్తీ చేయాలని ఆయన కోరారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో 64 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదోన్నతులు కల్పించి జూనియర్ కళాశాలల్లో పోస్టులు భర్తీ చేస్తే సుమారు 700 జూనియర్ లెక్చరర్ (పీడీ) పోస్టులు భర్తీ చేయవచ్చని, యువజన సేవా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో పీడీ పోస్టులు మంజూరు చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు...
By Boiena Rajesh 2026-02-26 15:41:49 0 180
Andhra Pradesh
గ్రీన్ వుడ్ హై స్కూల్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ...
By Kothuru Murali 2026-04-11 06:38:10 0 80
Telangana
కార్యకర్తల ఆరెస్ట్లు
మున్సిపాల్ ఎన్నికల్లో BRS బాలన్నీ  దేబతీయదానికే ప్రభుత్వం అరెస్టులు,వేదింపులకు పాల్పడుతుందని...
By Sadaq Sadaq 2026-02-01 11:58:18 0 256
Telangana
జీడి సంపత్ కుమార్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు హర్షించిన బస్తీ వాసులు
ఓల్డ్ మల్కాజిగిరి 140 డివిజన్ ముస్లిం బస్తీలో ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి...
By Vadla Egonda 2025-07-15 05:51:03 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com