కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ : తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు. |

0
113

 

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ రాశారు.

రాబోయే రామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి తీవ్రమైన ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ నంబర్ల నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఒక లేఖ ద్వారా తన కుమారుడిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

ఈ బెదిరింపుల వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉండవచ్చని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు

.స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోవడంలో పురోగతి లేదని, అందుకే కేంద్రం జోక్యం చేసుకుని లోతైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

భద్రతా పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, హిందూ ధర్మ రక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ పథకం పేరు మార్పు
కర్నూలు !! ఉపాధి హామీ పథకం పేరు మార్పు ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం...
By Hari Krishna 2025-12-12 16:40:28 0 239
Business
India–China in Talks to Restart Border Trade
India and China are currently holding discussions to resume border trade in domestic goods,...
By Bharat Aawaz 2025-08-14 07:07:17 0 1K
Telangana
మూసీ ప్రక్షాళనలో కీలక అడుగు: 10 వేల ఇళ్లు, 3,200 ఎకరాల సేకరణకు గెజిట్ విడుదల!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'మూసీ రివర్‌ఫ్రంట్...
By Sidhu Maroju 2026-03-13 10:49:34 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com