Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.

0
195

 

 

Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

20-03-2026 Fri 19:25 | Andhra

Chandrababu Naidu Reaches Tirumala with Family

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం కుటుంబసమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు.

 

రేపు శనివారం (మార్చి 21) నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి సేవలో పాల్గొననున్నారు. దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని నారా వారి కుటుంబం తరఫున ప్రతి ఏటా కొనసాగిస్తున్న ఆనవాయతీ ప్రకారం, ఈసారి కూడా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించనున్నారు. ఒకరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా సమర్పించనున్నారు.

 

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రాత్రికి చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తిరుమలలోనే బస చేసి, రేపు ఉదయం దర్శనానంతరం తిరిగి బయలుదేరనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...
By Rajini Kumari 2025-12-28 09:42:23 0 311
SURAKSHA
P. Vijayan IPS: Inspiring Kerala Through Visionary Policing
The Journey Begins "A police force becomes truly successful when it earns the confidence of...
By Fathima Safa 2026-07-08 11:51:43 0 101
Telangana
మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్...
By Mittapelli Saketh 2026-03-28 10:51:43 0 529
Telangana
గంజాయి తీసుకుంటూ దొరికిన MLA కుమారుడు
TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ...
By Mitappaly Shiavji 2026-01-03 10:57:31 0 609
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం, శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న చింత చెట్టు నుంచి పాలు కారుతుండటాన్ని స్థానిక మహిళలు దైవ మహిమగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం, శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న చింత...
By Kothuru Murali 2026-01-27 13:36:38 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com