Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.

0
130

 

 

Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

20-03-2026 Fri 19:25 | Andhra

Chandrababu Naidu Reaches Tirumala with Family

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం కుటుంబసమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు.

 

రేపు శనివారం (మార్చి 21) నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి సేవలో పాల్గొననున్నారు. దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని నారా వారి కుటుంబం తరఫున ప్రతి ఏటా కొనసాగిస్తున్న ఆనవాయతీ ప్రకారం, ఈసారి కూడా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించనున్నారు. ఒకరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా సమర్పించనున్నారు.

 

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రాత్రికి చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తిరుమలలోనే బస చేసి, రేపు ఉదయం దర్శనానంతరం తిరిగి బయలుదేరనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
*శ్రీకాళహస్తిలో వైద్యం శాంతారాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన -కోట చంద్రశేఖర్*
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:19:57 0 751
Telangana
సంగారెడ్డి జిల్లా పోలీస్ వాహనం డికొని ASI మృతి
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ వాహనం డికొని asi గోవింద్ నాయక్ పైకి...
By Gandla Vaijanath 2026-04-14 03:36:42 0 160
Andhra Pradesh
ఆన్లైన్ గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లలు మందలించడమే పాపమా
*ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు అన్న పాపానికి ...కన్న తల్లి తండ్రి ని చంపి...తాను ఆత్మహత్య...
By Rajini Kumari 2026-02-28 09:26:10 0 115
Andhra Pradesh
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు.
పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-04-10 06:06:50 0 72
Andhra Pradesh
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
By Pagadala Venkateswar 2026-01-28 10:02:51 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com